బెంగళూరు-కడప-విజయవాడల మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి
బెంగళూరు నుంచి కడప జిల్లా మీదుగా విజయవాడకు గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్
రూ.13,600 కోట్లతో 342 కి.మీ.మేర నిర్మాణం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్
ఈనాడు, అమరావతి: బెంగళూరు నుంచి కడప జిల్లా మీదుగా విజయవాడకు గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. 342 కి.మీ. పొడవున నూతనంగా నిర్మించే ఈ రహదారికి రూ.13,600 కోట్లు వెచ్చిస్తామన్నారు. ఇది కర్ణాటక, ఏపీలోని రెండు ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తుందని, దీనివల్ల 75 కి.మీ. దూరంతోపాటు 5 గంటల ప్రయాణ సమయం సైతం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న, మున్ముందు రానున్న గుంటూరు, కడప, కొప్పర్తి ఆర్థిక, పారిశ్రామిక నోడ్లకు అనుసంధానం మెరుగుపరిచేందుకు ఈ రహదారి దోహదపడుతుందని వివరించారు. ఇది 2025-26 నాటికి పూర్తవుతుందని ఆయన ట్విటర్లో తెలిపారు. కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి-44లో అనంతపురం జిల్లా కొడికొండ వద్ద మొదలై... కడప జిల్లా మీదుగా ప్రకాశం జిల్లాలోని మేదరమెట్లకు సమీపంలో చెన్నై-కోల్కతా జాతీయ రహదారి-16లో కలిసేలా ఈ రోడ్డుకు రూపకల్పన చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!