రేపు తిరుమలకు సీజేఐ జస్టిస్‌ లలిత్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ శనివారం తిరుమలకు రానున్నారు. 1వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ఎయిరిండియా విమానంలో రేణిగుంట

Published : 30 Sep 2022 04:59 IST

ఈనాడు, తిరుపతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ శనివారం తిరుమలకు రానున్నారు. 1వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ఎయిరిండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. శనివారం రాత్రి తిరుమలలో జరిగే శ్రీవారి గరుడ సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. 2వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి వెళ్లనున్నారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని