రాజకీయ సభను తలపించిన ధన్యవాదాల సభ

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉప కులపతిగా నియమితులైన ఆచార్య రాజశేఖర్‌ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలపడం కోసం శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన సభ రాజకీయ సభను తలపించేలా సాగింది.

Published : 01 Oct 2022 05:17 IST

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉప కులపతిగా నియమితులైన ఆచార్య రాజశేఖర్‌ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలపడం కోసం శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన సభ రాజకీయ సభను తలపించేలా సాగింది. ఇందులో అధ్యాపకులు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ‘జై జగన్‌’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సభలో రాజశేఖర్‌ మాట్లాడుతూ పూర్తి అదనపు బాధ్యతల వీసీగా (ఎఫ్‌ఏసీ) తనకు ముఖ్యమంత్రి జగన్‌ అవకాశం ఇవ్వగా.. ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని.. అందుకే తనకు రెగ్యులర్‌ వీసీగా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ సహా నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, జిల్లా శాసనసభ్యులు, పలువురు ఉన్నతాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను ఏవేవో తప్పులు చేశాననే ఆరోపణలు వచ్చాయని, అవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. వర్సిటీ ప్రాంగణంలో వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేస్తే రాద్ధాంతం చేశారని, కానీ అది పదేళ్ల క్రితం ఎగ్జిక్యుటివ్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని