మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామక ప్రక్రియలో ముందుకెళ్లొద్దు
మండలానికి ఇద్దరు ఎంఈవోల(మండల విద్యాధికారులు) నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 20 వరకు ముందుకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విచారణ అక్టోబరు 20కి వాయిదా
ఎస్జీపీ తీరుపై అసహనం
ఈనాడు, అమరావతి: మండలానికి ఇద్దరు ఎంఈవోల(మండల విద్యాధికారులు) నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 20 వరకు ముందుకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది. ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులకు విరుద్ధంగా మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరు 16న జీవో 154ని తీసుకొచ్చిందని పేర్కొంటూ జడ్పీహెచ్ పాఠశాలల్లో హెడ్మాస్టర్లుగా పనిచేస్తున్న డి.ఆర్.డి.కుమార్ మరికొందరు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాదులు ఇద్దరు వాదనలు వినిపించారు. ఎంఈవోల పోస్టుల సృష్టికి ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులు ఉండాలన్నారు. అలాంటి ఉత్తర్వులు ఏమీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంఈవోల పోస్టులను సృష్టించిందన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన జీవో చట్ట విరుద్ధం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 250 మంది హెడ్మాస్టర్లకు ప్రభుత్వం ఇటీవల పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) ఇస్తూ ఎంఈవోలుగా నియమించిందన్నారు. కొత్త పోస్టులు సృష్టిస్తున్నామని సాకుగా చూపిస్తూ జిల్లా పరిషత్ పాఠశాలల్లో హెడ్మాస్టర్లను ఉద్దేశపూర్వకంగా విస్మరించి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పూర్తిస్థాయి ఎంఈవోలుగా నియమించే యత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇదే జరిగితే పిటిషనర్లకు ఎంఈవోలుగా అవకాశం లేకుండా పోతుందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించకుండా ఉద్యోగుల సర్వీసులను మార్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
ఎస్జీపీ తీరుపై అసహనం
వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎంఈవోల పోస్టుల సృష్టికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అవసరమా? లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) కాసా జగన్మోహన్రెడ్డి అత్యంత అభ్యంతరకరంగా, అనవసరంగా కోర్టుపై వ్యాఖ్యలు చేసినట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాదులు ఇదే తరహాలో కోర్టులో వాదనలు వినిపించడం చాలా దురదృష్టకరంగా కోర్టు భావిస్తోందన్నారు. ఈ విధంగా వాదనలు వినిపించడం వాంఛనీయం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయినప్పటికి కేసు విచారణను ముగించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తూ.. పిటిషనర్లవి కేవలం ఊహాజనిత ఆందోళన మాత్రమేనంది. ఉపాధ్యాయుల పదోన్నతిలో ఎప్పటి నుంచో ఉన్న ప్రతిష్టంభనను తొలగించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపింది. పోస్టుల సృష్టికి రాష్ట్రపతి అనుమతి ఉందా లేదా అనే అంశంపై ప్రభుత్వ న్యాయవాది సరైన సమాధానం ఇవ్వలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జీవో 154 ఆధారంగా అక్టోబర్ 20 వరకు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు