సంక్షిప్త వార్తలు(8)
మార్కెట్లో కందిపప్పు కిలో రూ.115 ఉండగా.. ప్రభుత్వం రూ.48 చొప్పున రాయితీ భరిస్తూ రూ.67కి కార్డుదారులకు పంపిణీ చేస్తోందని పౌర సరఫరాలశాఖ కమిషనర్ హెచ్
కందిపప్పుపై కిలోకు రూ.48 రాయితీ భరిస్తున్నాం
పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్కుమార్
ఈనాడు, అమరావతి: మార్కెట్లో కందిపప్పు కిలో రూ.115 ఉండగా.. ప్రభుత్వం రూ.48 చొప్పున రాయితీ భరిస్తూ రూ.67కి కార్డుదారులకు పంపిణీ చేస్తోందని పౌర సరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్కుమార్ తెలిపారు. ‘నిత్యావసరాల్లో కోత’ శీర్షికన ఆదివారం ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘2014-19 మధ్య కాలంలో 93వేల టన్నుల కందిపప్పు, 3.16 లక్షల టన్నుల పంచదార పంపిణీ చేయగా 2019-20 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు 2.76 లక్షల టన్నుల కందిపప్పు, 2.14 లక్షల టన్నుల పంచదారను కార్డుదారులకు అందించాం. ప్రజాపంపిణీ, పీఎంజీకేఏవై పథకాల కింద 2020 ఏప్రిల్ నుంచి నవంబరు వరకు రూ.1,795 కోట్ల విలువైన పప్పుధాన్యాలను కార్డుదారులకు పంపిణీ చేశాం. గత మూడేళ్లలో కందిపప్పు, పంచదారపై రూ.1,891 కోట్లను రాయితీ నిమిత్తం ఖర్చు చేశాం. ‘ఇంటింటికి రేషన్’ పంపిణీకి నెలకు రూ.25 కోట్లు, సాధారణ బియ్యాన్ని సార్టెక్స్గా మెరుగుపరిచేందుకు కిలోకు రూ.1 చొప్పున నెలకు రూ.20 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 2019 నాటికి రాష్ట్రంలో సగటున 1.39 కోట్ల రేషన్ కార్డులు ఉండగా ప్రస్తుతం 1.45 కోట్ల కార్డులున్నాయి’ అని వివరించారు. గతంలో రేషన్ పంపిణీ 87% నుంచి 89% ఉండగా.. ఇంటింటికి పంపిణీ ద్వారా 92% అయిందని పేర్కొన్నారు. వాహనం వచ్చిన సమయంలో రేషన్ తీసుకోలేకపోతే.. తర్వాత వారికి వీలైన సమయంలో దగ్గరలోని ఏ ఇతర వాహనంలో అయినా తీసుకోవచ్చని, సాయంత్రం సమయాల్లో గ్రామ సచివాలయం వద్ద నిలిపి ఉంచే వాహనాల దగ్గరైనా రేషన్ ఇస్తారని తెలిపారు.
‘కృష్ణపట్నం’ మూడో యూనిట్లో నెలాఖరుకు విద్యుదుత్పత్తి: మంత్రి పెద్దిరెడ్డి
ఈనాడు, అమరావతి: నెల్లూరులోని కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిర్మాణం పూర్తయిన మూడో యూనిట్(800 మెగావాట్ల ప్లాంటు)లో నెలాఖరులోగా ఉత్పత్తి ప్రారంభిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే విజయవాడ వీటీపీఎస్లో నిర్మాణంలో ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యమున్న మరో ప్లాంటును 2023 మార్చి నాటికి ప్రారంభించేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పప్పు లేదు.. పంచదారా లేదు: ఐద్వా ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్ చేశారు. రెండు, మూడు నెలలుగా పంచదార, కందిపప్పు సరిగా ఇవ్వడం లేదని.. ఇది పౌరసరఫరాల శాఖ బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. వీటి పంపిణీని పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో వినతిపత్రం అందజేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఐద్వా కమిటీలకు ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. ‘‘రేషన్ దుకాణాల్లో కందిపప్పు, పంచదార ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల ఇస్తున్నా నాణ్యత లేని కందిపప్పు ఇస్తున్నారని మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని సరఫరాను పునరుద్ధరించాలి’’ అనిరమాదేవి కోరారు.
సొంత నిధులతో రోడ్డు నిర్మాణం
కళ్యాణదుర్గం, న్యూస్టుడే: జనం అవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 8వ వార్డు తెదేపా కౌన్సిలర్ నూర్జహాన్ సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. స్థానిక గుడ్లప్పదొడ్డిలో రహదారి అధ్వానంగా ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ నూర్జహాన్ రూ.1.50 లక్షలతో సిమెంటు రోడ్డు, మురుగు కాలువ నిర్మించారు.
ప్రభుత్వంపై అసత్య ప్రచారం మానండి
మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ సిటీ, న్యూస్టుడే: ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదని అమరావతి రాజధాని రైతులు అసత్య ప్రచారం చేయడం తగదని రాష్ట్ర పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆదివారం ఆయన సందర్శించారు. రైతులకు ఏటా కౌలు చెల్లిస్తున్నామని మంత్రి వివరించారు. అమరావతిలో 60 వేల ప్లాట్లు ఉంటే ఇప్పటికే 40 వేలు రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం అక్కడ బాహుబలి గ్రాఫిక్స్ చూపిందని, పనులు తక్కువేనని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందితే సరిపోవని, రాష్ట్రమంతా ప్రగతి అవసరమని, అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని వివరించారు.
రూ.2 వేల కోట్ల దసపల్లా భూములు లాగించేసి ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణ అమల్లోకి తీసుకొచ్చారు
పోతుల బాలకోటయ్య విమర్శ
ఈనాడు, అమరావతి: ‘‘కంగ్రాట్స్ సార్! రూ.2 వేల కోట్ల విలువైన దసపల్లా భూములు లాగించేసి రాజధాని రాకముందే ఉత్తరాంధ్రలో ‘వికేంద్రీకరణ’ అమల్లోకి తీసుకొచ్చారు’’ అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విమర్శించారు. ఇక రాజధాని కూడా వస్తే బంగారంతో బాత్రూమ్లు, మరుగుదొడ్లు కట్టుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ‘‘దసపల్లా భూములపై విజయసాయి వల’’ శీర్షికతో ‘ఈనాడు’లో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని ఆయన తన ట్వీట్కు జతపరిచారు. ‘‘ఉత్తరాంధ్ర మేధావులారా! మీరు, విశాఖ ప్రజలు నా వైపు తల తిప్పకుండా అమరావతిపై రాళ్లేయించండి’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
‘సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’
ఈనాడు, అమరావతి: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు హెచ్చరించారు. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఇప్పటికే సమాచారం అందించామని ఆయన వివరించారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కళాశాలల గుర్తింపు రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
ఈనాడు డిజిటల్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా దేవాంగ కర్ణ నాగరాజు(అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా పుచ్చల రామకృష్ణ(రాజమహేంద్రవరం), కోశాధికారిగా ఉప్పు కనకరాజు(విశాఖపట్నం)ను ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఈ ఎన్నిక జరిగినట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న ప్రొద్దుటూరులో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దేవాంగులున్నా...ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని.. ఐక్య పోరాటం ద్వారా మాత్రమే హక్కులు సాధించుకోగలమని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా