‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు
అధికారుల ప్రణాళికలేమితో ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం వచ్చిన సమయంలో ఘాట్రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద భక్తులను ఆపేశారు.
దర్శనం నిలిపివేతతో చిన్నారుల అవస్థలు
విజయవాడ వన్టౌన్, న్యూస్టుడే: అధికారుల ప్రణాళికలేమితో ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం వచ్చిన సమయంలో ఘాట్రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద భక్తులను ఆపేశారు. మధ్యాహ్నం 2.55గంటలకు పోలీసులు అన్ని క్యూలైన్లను నిలిపివేశారు. అప్పటికే వరుసల్లో ఉన్న కొందరు భక్తులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులు అప్రమత్తమై వారిని లోపలున్న క్యూలైన్లలోకి వదిలేశారు. సీఎం వెళ్లిపోయిన తర్వాత 4.20 నుంచి దర్శనాన్ని పునరుద్ధరించారు. గంటకుపైగా క్యూలైన్లు స్తంభించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చంటిపిల్లలతో ఉన్నవారు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. దాహం, ఉక్కపోతతో కొందరు బయటకు రాగా, వాలంటీర్లు అప్రమత్తమై మంచినీటి ప్యాకెట్లు అందజేశారు. గతంలో ముఖ్యమంత్రుల పర్యటన ఉన్నా సర్వదర్శనంలోని భక్తులను అనుమతించే వారని పలువురు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి దర్శనానికి వెళ్తున్న సమయంలో రాజగోపురం పాయింట్ సమీపంలో కొందరు జై పవన్ అని నినదించగా, జగన్ వెనక్కి చూసుకుంటూ వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!