దసపల్లా భూముల్లో తప్పటడుగులు
విశాఖ దసపల్లా భూముల వ్యవహారంలో జిల్లా యంత్రాంగం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముందుచూపు లేమి, న్యాయస్థానాల్లో బలంగా వాదనలు వినిపించకపోవడం, నిబంధనల అమలులో తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యంత్రాంగం తీరుపై అనుమానాలు
విశాఖపట్నం (వన్టౌన్), న్యూస్టుడే: విశాఖ దసపల్లా భూముల వ్యవహారంలో జిల్లా యంత్రాంగం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముందుచూపు లేమి, న్యాయస్థానాల్లో బలంగా వాదనలు వినిపించకపోవడం, నిబంధనల అమలులో తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగినా భూమిపై హక్కుల (టైటిల్) కోసమే పోరు సాగించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) కింద భూములు చేజిక్కించుకొనే అవకాశం ఏర్పడినా అలా చేయకపోవడంతో ఇప్పుడు రూ.2వేల కోట్ల విలువైన భూములు చేజారే పరిస్థితి ఏర్పడింది. భూ వ్యవహారం వెనుక వైకాపా కీలక నేత ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఎలా ముందుకెళ్లాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
1976 నాటి వివాదం
* దసపల్లా హిల్స్లోని సర్వే నంబర్లు 1027, 1028, 1196, 1197ల్లో ఉన్న 60 ఎకరాల భూములు రాణీ కమలాదేవికి ఆమె తండ్రి నారాయణ గజపతిరాజు ద్వారా 1938లో సంక్రమించాయి. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఆ భూములకు శిస్తులు చెల్లించడంతో 1958లో దసపల్లా భూములకు రాణీ కమలాదేవి పేరుతో గ్రౌండు రెంట్ పట్టా లభించింది. 1976లో పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్సీ) చట్టం అమల్లోకి వచ్చింది. వెంటనే రాణి తన భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం 1500 గజాల భూమిని ఆమెకు ఇచ్చేసి మిగిలినది తీసుకోవాలి. ఈ ప్రకారమే అప్పటి అధికారులు చేశారు. అయితే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నందున ఒక్కొక్కరికి 1500 గజాలు ఇవ్వాలని రాణీ కమలాదేవి కోరగా, అధికారులు అంగీకరించలేదు. దాంతో ఆమె హైకోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంతవరకూ తేలలేదు. దీనిపై యంత్రాంగం దృష్టిపెట్టలేదు.
* భూముల విషయం కోర్టులో ఉన్నా... 1980 ప్రాంతంలో టౌన్ప్లానింగ్ అధికారులు మొత్తం 60 ఎకరాల్లో కొండ ప్రాంతంలో ఉన్న 20 ఎకరాలు వదిలేసి, మిగిలిన 40 ఎకరాలను లే అవుట్ అభివృద్ధి చేసి, అమ్మేశారు. వాటిలో ఒక్క ఎకరం మాత్రం నౌకాదళ అవసరాలకు కేటాయించారు. అప్పటి టౌన్ప్లానింగ్ అధికారులు ఈ 40 ఎకరాల భూములకు రాణీ కమలాదేవికి పరిహారం చెల్లించారు. మిగిలిన 20 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో 5 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయి. మిగిలిన 15 ఎకరాలను రాణీ కమలాదేవి కుటుంబసభ్యులు అనధికారికంగా అమ్మేసుకున్నారు.
యూఎల్సీ అంశాన్ని గాలికొదిలేసి..
* యూఎల్సీ కేసును పక్కన పెట్టి, రాణికి జారీచేసిన గ్రౌండ్రెంట్ పట్టా చెల్లదని, రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు ప్రభుత్వానివిగా ఉన్నాయని అధికారులు వాదిస్తూ వెళ్లారు. తొలుత సర్వే అండ్ సెటిల్మెంట్ కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినా.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మాత్రం రాణీ కమలాదేవి నెగ్గారు. టైటిల్పై దృష్టిసారించిన అధికారులు, యూఎల్సీ వ్యవహారాన్ని పక్కన పెట్టేయడం సమస్యగా మారింది.
* 2009లో హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో తీవ్ర జాప్యం జరిగింది. 90 రోజుల్లో వేయాల్సిన ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్)ని 570 రోజుల తర్వాత దాఖలుచేశారు. దీంతో 2013లో నాటి కలెక్టర్ అప్పటి సీతమ్మధార తహసీల్దార్ను సస్పెండ్ చేశారు.
* సకాలంలో ఎస్ఎల్పీ దాఖలు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. యూఎల్సీ కేసు ఆధారంగా ముందుకెళ్లినా ప్రయోజనం ఉండేది. దాన్ని వదిలేసి కేవలం టైటిల్పై యంత్రాంగం దృష్టి సారించడంతో ఇప్పుడు విలువైన భూములు వేరేవారి చేతికి వెళ్లి భారీ స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు జరగడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి