వైకాపా కార్యాలయానికి భూ కేటాయింపుపై నిరసన

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు శివారులో చింతలవీధి వద్ద రెండెకరాల భూమిని వైకాపా కార్యాలయం ఏర్పాటుకు కేటాయించడంపై స్థానికులు ఆదివారం పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

Published : 03 Oct 2022 03:01 IST

పాడేరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు శివారులో చింతలవీధి వద్ద రెండెకరాల భూమిని వైకాపా కార్యాలయం ఏర్పాటుకు కేటాయించడంపై స్థానికులు ఆదివారం పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామస్థులు పాడేరు-హుకుంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. వాహనాల రాకపోకలు సుమారు గంటకు పైగా నిలిచిపోయాయి. ఎస్సై లక్ష్మణ్‌ అక్కడకు చేరుకుని అందోళనకారులకు నచ్చజెప్పి పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ నిరుపేదలకు చెందాల్సిన బంజరు భూములను వైకాపా కార్యాలయానికి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. తమ పూర్వీకుల నుంచి ఈ భూమిని పశువుల పెంపకం, ఇతర అవసరాలకు వాడుకుంటున్నామన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని