బస్సు కాదు బుస్సు
ఏలూరు జిల్లాలో ఇటీవల జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న పల్లెవెలుగు బస్సుకు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం సమీపంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది.
తుక్కు చేయాల్సినవి రోడ్డెక్కిస్తున్నారు
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం..
చక్రాలు, స్టీరింగ్ ఊడుతున్నా పట్టింపే లేదు
12 లక్షల కి.మీ. పైగా తిరిగినవి 3,777
సూపర్ లగ్జరీల్లోనూ ఇదే పరిస్థితి
ఛార్జీల మోత సరే.. కొత్త బస్సులేవీ?
ఏలూరు జిల్లాలో ఇటీవల జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న పల్లెవెలుగు బస్సుకు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం సమీపంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకుపోయింది. అందులో ఉన్న 27 మంది ప్రయాణికులు కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవలే ఆ విద్యుత్ స్తంభానికి ఉండే వైర్లను తొలగించారు. లేకపోతే ఘోరం జరిగి ఉండేది!
ఆర్టీసీలో కాలంచెల్లిన బస్సులు నిత్యం ఎక్కడోచోట ప్రమాదానికి గురవుతున్నాయి. అదుపుతప్పి పొలాల్లోకో, పిల్లకాల్వల్లోకో దూసుకుపోవడం, రన్నింగ్లోనే చక్రాలు ఊడిపోవడం వంటి సంఘటనలు చోటుచేసకుంటున్నాయి. ప్రయాణం మధ్యలో రోడ్లపై ఆగిపోతున్నవి మరికొన్ని. అసలే అడుగుకో గుంతతో అధ్వానంగా ఉన్న రహదారులపై బస్సుల్లో ప్రయాణం ప్రహసనంగా మారింది. వీటికితోడు అత్యధిక కిలోమీటర్లు తిరిగేసిన బస్సులను పక్కనపెట్టకుండా నిత్యం పరుగులు పెట్టిస్తుండటంతో అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ ఇటువంటి బస్సులను రోడ్డెక్కించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందనే విమర్శలు వస్తున్నాయి. సెస్సుల పేరుతో పదేపదే ఛార్జీలు పెంచి ప్రయాణికులపై కోట్లాది రూపాయల భారం వేస్తున్న ఆర్టీసీ.. కొత్త బస్సుల్ని అందుబాటులోకి తీసుకు రావడంపై మాత్రం దృష్టిపెట్టడంలేదు. ఛార్జీలు ఎక్కువైనా డొక్కు బస్సుల్లోనే ప్రయాణించండి అనేలా వ్యవహరిస్తోంది.
ఏపీఎస్ ఆర్టీసీలో జులై నెల లెక్కల ప్రకారం 9,004 సొంత బస్సులు ఉన్నాయి. వీటిలో 12 లక్షల కి.మీ.కు పైగా తిరిగేసినవి 3,777 ఉంన్నాయి. ఇవి నిత్యం పరుగులు పెడుతూనే ఉన్నాయి. సాధారణంగా తిరుమల ఘాట్లో తిరిగే సప్తగిరి బస్సులను 7 లక్షల కి.మీ.లు, సూపర్లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ వంటి సర్వీసులు 10 లక్షల కి.మీ. తిరిగిన తర్వాత వాటిని బాడీ మార్పు చేసి పల్లెవెలుగు సర్వీసులుగా నడుపుతుంటారు. అవి కూడా 12 లక్షల కి.మీ. వరకే నడపాలి. ఆ తర్వాత తుక్కు చేయాలి. కానీ కొత్త బస్సుల కొనకపోవడంతో ఈ కాలం చెల్లిన బస్సులనే రోడ్డెక్కిస్తున్నారు. ఇవి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.
పల్లెవెలుగుల్లో మూడొంతులు ఇవే
* ఆర్టీసీ సొంత బస్సుల్లో పల్లెవెలుగు సర్వీసులు 4,121 ఉండగా, వాటిలో 12 లక్షల కి.మీకు పైగా నడిచినవి 3,053 ఉన్నాయి. అంటే ప్రతి నాలుగింట మూడు కాలం చెల్లినవి కిందే లెక్క. 15 లక్షల కి.మీ.కు పైగా తిరిగినవి సైతం 548 ఉండటం గమనార్హం.
* సిటీ ఆర్డినరీ సర్వీసుల్లోనూ దాదాపు సగం కాలం చెల్లినవే. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 703 సిటీ సర్వీసులు ఉన్నాయి. వాటిలో 12 లక్షల కి.మీ.కు పైగా నడిచినవి 341 ఉన్నాయి. 15 లక్షల కి.మీ. కంటే ఎక్కువ తిరిగినవి 51 బస్సులు ఇంకా పరుగులు పెడుతూనే ఉన్నాయి.
* ప్రైవేటు ట్రావెల్స్తో పోటీ పడాలంటే.. దూర ప్రాంతాలకు తిరిగే సూపర్ లగ్జరీ సర్వీసులు మంచి కండిషన్లో ఉన్నవి నడపాలి. 10 లక్షల కి.మీ. దాటిపోతే, వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలి. కానీ మొత్తం 1,254 సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 లక్షల కి.మీ.కు పైగా తిరిగినవి 439 ఇంకా నడుస్తూనే ఉన్నాయి.
వాటాకు సిద్ధమైన ప్రభుత్వం
ఉద్యోగుల జీతాలు ప్రభుత్వం ఇస్తున్నందున.. ఆర్టీసీ రాబడిలో తమకు వాటా ఇవ్వాలని చాలాకాలంగా ప్రభుత్వం అడుగుతోంది. ఇందులో భాగంగా 25 శాతం ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వనుంది. టికెట్ ఛార్జీలు పెరగడంతో ప్రస్తుతం నెలకు సగటున రూ. 500 కోట్ల వరకు రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో రూ. 125 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. యాజమాన్యం కొత్త బస్సుల కొనుగోళ్లపై దృషి ్టపెట్టడం లేదు. 2020లో హడావిడిగా 300 బస్సులు కొన్నారు. తర్వాత కొత్త బస్సుల ఊసు లేదు. పల్లెవెలుగు బస్సులైతే పాతవాటికే సీట్లు మార్చి, రంగులు వేసి, లైటింగ్ వంటి లోపాలు సరిచేసి నడుపుతున్నారు. అలాగే అద్దె బస్సుల సంఖ్యను పెంచుకోవడంపైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. కొద్దినెలల కిందట 998 అద్దె బస్సులు తీసుకోడానికి టెండర్లు పిలిస్తే.. 339 బస్సులకే ప్రైవేటు యజమానులు ముందుకొచ్చారు. తర్వాత 659 బస్సులకు టెండర్లు పిలిచారు. ఇటీవలే 372 సూపర్లగ్జరీ, 82 అల్ట్రా డీలక్స్, 152 సప్తగిరి సర్వీసులు (తిరుమల ఘాట్లో తిరిగేవి), 11 ఏసీ బస్సులు కలిపి మొత్తం 617 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది.
క్షేమంగా తిరిగి వస్తే గట్టెక్కినట్లే..
కాలం చెల్లిన బస్సులు తరచూ పాడవుతున్నాయి. వారంలో కనీసం రెండు, మూడుసార్లు మరమ్మతులు చేయాల్సి వస్తోందని, ఎంత బాగుచేసినా మళ్లీ ఏదో ఒక సమస్య వస్తోందని ఆర్టీసీ మెకానిక్ ఒకరు తెలిపారు. దారిలో ఎక్కడ ఆగిపోతుందో తెలియదని, డిపో నుంచి బయటకు వెళ్లి.. ఆగకుండా తిరిగి వస్తే ఆ రోజుకు గట్టెక్కినట్లే అని పల్లెవెలుగు సర్వీసు డ్రైవర్ ఒకరు వాపోయారు.
- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్