అప్పుగా తెచ్చిన రూ.70 వేలు... ఎలుకల పాలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు పంచాయతీలోని బృందావనం గ్రామానికి చెందిన చిరుగూరి అగస్టీన్ రోజు వారీ కూలీ.
ముండ్లమూరు, న్యూస్టుడే: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు పంచాయతీలోని బృందావనం గ్రామానికి చెందిన చిరుగూరి అగస్టీన్ రోజు వారీ కూలీ. తిండి గింజల కోసం కొంత భూమిలో వరి సాగు చేస్తున్నారు. పంట పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం రెండు రోజుల క్రితం రూ.70 వేలు అప్పు చేసి తీసుకొచ్చి ఇంట్లో గోడకు అమర్చిన చిన్న చెక్క పెట్టెలో పెట్టారు. ఆదివారం తాళం తీసి చూసేసరికి నోట్లన్నీ ముక్కలు ముక్కలుగా చిరిగి ఉన్నాయి. చెక్క పెట్టె వెనుక గోడకు రంధ్రం ఏర్పడటంతో ఎలుకలు వచ్చి నగదును కొరికేశాయని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్