కాలం నేర్పిన జలపాఠం
కాలంతోపాటే వరి సాగు విధానం మారుతోంది. నీటి లభ్యత తగ్గడం.. గతి తప్పుతున్న రుతుపవనాల కారణంగా సంప్రదాయ వరి నాట్లకు బదులు రైతులు ‘వెద’ పద్ధతికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
పెట్టుబడి ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ
మన వెద సాగు విధానం దేశంలోనే ఆదర్శం
ఈనాడు-అమరావతి: కాలంతోపాటే వరి సాగు విధానం మారుతోంది. నీటి లభ్యత తగ్గడం.. గతి తప్పుతున్న రుతుపవనాల కారణంగా సంప్రదాయ వరి నాట్లకు బదులు రైతులు ‘వెద’ పద్ధతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సంప్రదాయ విధానంలోలాగా నారు పోసి నాట్లు వేయడం కాకుండా నేరుగా విత్తనాలను చల్లే ఈ విధానంలో కూలీల అవసరం తగ్గుతుంది. సాగునీటి పొదుపు.. తక్కువ పెట్టుబడి వంటి సానుకూల అంశాలు కర్షకులకు కలసి వస్తున్నాయి. వరిలో మడమ లోతు నీరు నిలిపి ఉంచకుండా అవసరం మేరకే నీరు పెట్టడానికి రైతులు అలవాటు పడుతున్నారు. ఇదంతా కాలం నేర్పిన జల‘పాఠం’! ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుసగా 12వ ఏడాదిలోనూ ‘వెద’ పద్ధతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లలో ఈ విధానంలో వరి సాగవుతుండగా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోనే లక్ష హెక్టార్లలో సాగవుతోంది. ఇక్కడి విధానాన్ని అధ్యయనం చేసిన తమిళనాడు శాస్త్రవేత్తలు అక్కడా అమలు చేస్తున్నారు. పంజాబ్లో గతేడాది వెద విధానంలో 5.62 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి అక్కడి ప్రభుత్వం ఎకరాకు రూ. 1,500 ప్రోత్సాహం ప్రకటించింది.
నీటి లభ్యత లేకున్నా..
ఆరుతడి విధానం వల్ల నీటిలభ్యత లేక ఒకటి రెండు రోజులు సాగునీరు ఆలస్యమైనా పెద్దగా ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. వెద విధానంలో పెట్టుబడి, కూలీలు తగ్గడంతోపాటు పంట పది రోజుల ముందుగానే కోతకు వస్తుందని మార్టేరు ప్రాంతీయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త దక్షిణామూర్తి తెలిపారు. డ్రమ్సీడర్ ద్వారా విత్తడం వల్ల సాగులో యాంత్రీకరణకు వెసులుబాటు కలుగుతుంది. వెద సాగులో మీథేన్ గ్యాస్ విడుదల 38 శాతం వరకు తగ్గుతుందని అంతర్జాతీయ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీనిపై మార్టేరు ప్రాంతీయ పరిశోధన కేంద్రంలోనూ పరిశోధనలు ప్రారంభించామని దక్షిణామూర్తి తెలిపారు.
కూలీల అవసరం తక్కువే..
* వరి సాగులో వెద పద్ధతిలో కూలీల అవసరం బాగా తగ్గుతుంది.
* హెక్టారుకు 37 కిలోల వరకు విత్తనం ఆదా అవుతుంది.
* పెట్టుబడి వ్యయం హెక్టారుకు రూ. 18,625 తగ్గుతుంది.
* సంప్రదాయ సాగుతో పోల్చితే 18 నుంచి 22 శాతం నీరు ఆదా చేయవచ్చు.
* ఎకరానికి దిగుబడి 5 బస్తాలకు పైగా దిగుబడి పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?