ప్రైవేటుకు పర్యాటకం
ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి చెందిన పలు విలువైన ఆస్తులు వెళ్లనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోగల 22 రెస్టారెంట్లు, కాటేజీలు, ఫుడ్ కోర్టులను ప్రైవేట్ సంస్థలకు కనిష్ఠంగా 5 ఏళ్లు, గరిష్ఠంగా 20 ఏళ్లపాటు లీజుకి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏపీటీడీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు.
22 రెస్టారెంట్లు, కాటేజీలు, ఫుడ్ కోర్టులు లీజుకు..
టెండర్లను ఆహ్వానించిన పర్యాటకాభివృద్ధి సంస్థ
బ్యాంకు రుణంతో ఆధునికీకరణ వట్టిమాటేనా?
ఈనాడు - అమరావతి
ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి చెందిన పలు విలువైన ఆస్తులు వెళ్లనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోగల 22 రెస్టారెంట్లు, కాటేజీలు, ఫుడ్ కోర్టులను ప్రైవేట్ సంస్థలకు కనిష్ఠంగా 5 ఏళ్లు, గరిష్ఠంగా 20 ఏళ్లపాటు లీజుకి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏపీటీడీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఒక జాతీయ బ్యాంకు ఆర్థిక సాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, కాటేజీలను ఆధునీకరిస్తామని ఒక వైపున చెబుతూ...ఇంకోవైపున ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేయడం ఏపీటీడీసీలో చర్చనీయాంశమవుతోంది.
లీజుకిచ్చే ఆస్తులివే..
* వైయస్ఆర్ జిల్లాలో కడపలోని హరిత హోటల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే 2,767 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇవ్వనున్నారు. సిద్దవటంలో రెస్టారెంట్, గండికోటలో 15 టెంట్లు, కిచెన్, రెస్టారెంట్కి టెండర్ పిలిచారు.
* సత్యసాయిజిల్లా వెంకటాపురంలో హోటల్, కర్నూలులో బ్యాంకెట్ హాలు, తిరుపతిజిల్లా తడలో రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాలు, బీవీ పాలెంలో బార్, 15 ఉడెన్ కాటేజీలు, రెస్టారెంట్, ఇసకపల్లిలో రెస్టారెంట్, బార్ లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే జిల్లాలోని కొత్త కోడూరు, ఉదయగిరి, రామతీర్థంలోని రెస్టారెంట్లు కూడా లీజుకి పెట్టారు.
* ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ దగ్గర్లోని రెస్టారెంట్, ఎనిమిది కాటేజీలు, స్విమ్మింగ్ పూల్, తిరుపతి జిల్లా పుత్తూరులోని రెస్టారెంట్, పల్నాడు జిల్లాలో ధ్యానబుద్ద సమీపంలోని హోటల్, కోటప్పకొండలో రెస్టారెంట్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ముక్త్యాలలోని రెస్టారెంట్ లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు.
* శ్రీకాకుళం జిల్లా శాలిహుండంలోని ఎమినిటీ సెంటర్లో గదులతోపాటు రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకులోగల డ్రైవ్-ఇన్ రెస్టారెంట్, బుద్దిస్ట్ సర్క్యూట్లోని అమరావతి, బావికొండ, గుంటుపల్లె, భట్టిప్రోలు వసతులను లీజుకి పెట్టారు.
రుషికొండ బీచ్లో ప్రవేశానికి రుసుము?
రాష్ట్రంలోని ఏకైక బ్లూఫ్లాగ్ బీచ్ రుషికొండ(విశాఖపట్నం)లో ప్రవేశానికి రాబోయే రోజుల్లో రుసుములు చెల్లించాల్సిందే. బీచ్ నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని ఏపీటీడీసీ నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే