ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు
ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల్లో మార్పులు చేసింది. ఫార్మెటివ్-1, 3, సమ్మెటివ్-2 పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా(సీబీఏ) విధానంలో నిర్వహిస్తారు.
ఓఎమ్మార్ విధానంలో ఫార్మెటివ్-1, 3, సమ్మెటివ్-2 పరీక్షలు
దిద్దుబాట్లకు ఆస్కారముందంటూ ఉపాధ్యాయుల ఆందోళన
ఈనాడు, అమరావతి: ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల్లో మార్పులు చేసింది. ఫార్మెటివ్-1, 3, సమ్మెటివ్-2 పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా(సీబీఏ) విధానంలో నిర్వహిస్తారు. ప్రపంచ బ్యాంకు ఒప్పందం నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేషించేందుకు ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ సంస్థతో విద్యాశాఖ మరో అవగాహన చేసుకుంది. ఈ సంస్థ ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు చేశారు. ఫార్మెటివ్ పరీక్షల్లో 15 మార్కులకు ఓఎమ్మార్ విధానంలో, మరో ఐదు మార్కులకు రాతపూర్వకంగా పరీక్ష నిర్వహిస్తారు. 1-8తరగతుల విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎమ్మార్ షీటు ఇస్తారు. ఇందులోనే ఒక్కో సబ్జెక్టుకు 15 చొప్పున బహుళైచ్చిక సమాధానాలు ఉంటాయి. మొదటి రోజు ఉదయం ప్రశ్నపత్రంతోపాటు ఓఎమ్మార్ షీటు ఇస్తారు. మధ్యాహ్నం పరీక్షకు మళ్లీ అదే ఓఎమ్మార్ను ఇస్తారు. ఇలా రెండు రోజులపాటు జరిగే పరీక్షలకు ఓఎమ్మార్ ఇచ్చి, తీసుకుంటారు. ప్రైవేటు వారికి ఓఎమ్మార్ షీట్లు ఉండవు. వారు ప్రశ్నపత్రంలోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఉర్దూ, కన్నడ లాంటి మైనర్ భాషలకు కూడా అంతే. ఈ షీట్ల ముద్రణ ఆలస్యమవుతున్నందున పరీక్షల షెడ్యూలును మార్చేశారు. నవంబరు 2-5వరకు ఫార్మెటివ్-1 పరీక్షలు ఉంటాయి. 9, 10 తరగతులకు పాత విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
తప్పుల సవరణకు అవకాశం?
విద్యార్థులకు ఉదయం పరీక్షకు సంబంధించిన ఓఎమ్మార్ షీటునే మళ్లీ మధ్యాహ్నం ఇస్తే సమాధానాలు మార్చే అవకాశం ఉంటుందని, తద్వారా అందరికీ ఎక్కువ మార్కులు రావొచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదాహరణకు.. ‘1-5 తరగతులకు నవంబరు ఒకటిన మొదటి రోజు ఉదయం తెలుగు ప్రశ్నపత్రంతోపాటు 15మార్కుల బహుళైచ్చిక జవాబులు రాసేందుకు ఓఎమ్మార్ షీటు ఇస్తారు. అందులో విద్యార్థులు కొన్నింటికి తప్పుడు సమాధానాలు రాయొచ్చు. పరీక్ష తర్వాత పిల్లలు తాము రాసిన జవాబుల్లో తప్పులను గుర్తిస్తారు. మధ్యాహ్నం జరిగే గణిత పరీక్షకు ఉదయం ఇచ్చిన ఓఎమ్మార్ షీట్నే మళ్లీ ఇస్తే ఉదయం మార్క్ చేసిన సమాధానాల్లోని తప్పులను సరిచేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు విద్యార్థుల సామర్థ్యాలను ఎలా అంచనా వేయగలం’ అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ఒప్పందం కారణంగా బేస్లైన్ పరీక్ష, తరగతి గది ఆధారిత అంచనా పరీక్షలంటూ ముద్రణకే రూ.కోట్లు వెచ్చిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్