వేతనాలు అందకుండా.. వేడుకలెలా?
రాష్ట్రంలో ఉద్యోగులకు ఈసారి దసరా పండగ.. పండగలా లేదు. సోమవారం రాత్రికి కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి కొందరికి జీతాలు, చాలామందికి పెన్షన్లు అందలేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు.
ఆర్బీఐ వేలం సొమ్ము అందితేనే వేతనాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగులకు ఈసారి దసరా పండగ.. పండగలా లేదు. సోమవారం రాత్రికి కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి కొందరికి జీతాలు, చాలామందికి పెన్షన్లు అందలేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. హిందూ పండగల్లో కీలకమైన విజయదశమికి పది రోజుల ముందు నుంచే శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలోనూ చేతికి జీతాలు అందక వేల మంది ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. కేవలం పెన్షను డబ్బులపైనే ఆధారపడ్డ రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉన్నాయని ఇటీవలే అసెంబ్లీలో ప్రభుత్వ అధినేతలు ఘనంగా ప్రకటించారని, అలాంటప్పుడు తమకు జీతాలివ్వకపోవడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘సాధారణంగా ఒకటో తేదీకల్లా మా చేతికి జీతాలు అందాలి. మూడు రోజులుగా ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. అక్కడక్కడ కొద్ది మందికి జీతాలు చెల్లించారు. ఎవరికి ఏ ప్రతిపాదికన మొదట వేతనాలు వేశారో తెలియడం లేదు’ అని వాపోతున్నారు. ఖజానా శాఖ గ్రీన్ ఛానల్లో వేతనాలు పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్లో కనిపిస్తోంది. వాస్తవానికి ఖజానాలో చాలినంత ఆర్థిక నిల్వలు లేవు. ప్రభుత్వం సోమవారం రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.2,000 కోట్లు సమీకరించింది. సాధారణంగా ప్రతి మంగళవారం ఆర్బీఐ వేలం వేస్తుండగా, ఈసారి దసరా సెలవుల దృష్ట్యా సోమవారమే ఆ ప్రక్రియ పూర్తిచేసింది. ఆర్బీఐ వేలం సొమ్ము మంగళవారం సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ అయితే, ఆ మొత్తాన్ని తొలుత ఉద్యోగుల జీతాలకు సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు. పెన్షన్లు, జీతాలు అందిరికీ వస్తాయా అన్నది అనుమానంగానే ఉంది. నిజానికి గతంలో పండగల సమయంలో ఉద్యోగులు జీతం అడ్వాన్సుగా తీసుకునేవారు. తొలుత అవసరాలు తీర్చుకుని ఆనక ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించేవారు. ఇటీవల జీతాలే ఆలస్యమవుతున్నందున అడ్వాన్సుల ఆలోచనే రాలేదని వేతనజీవులు వాపోతున్నారు.
జీతాలు, పెన్షన్లు అందక ఆందోళన: ఐకాస అమరావతి
ఈనాడు, అమరావతి: దసరా పండుగ వచ్చినా కొందరికి జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్, ప్రధాన కార్యదర్శి బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఫోన్లు, వాట్సప్ ద్వారా తమ ఆందోళన తెలియచేస్తున్నారన్నారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులను సంప్రదించగా మంగళవారంలోగా జీతాలు, పెన్షన్లు జమ చేస్తామన్నారని చెప్పారు.
జీతాలు వెంటనే చెల్లించాలి: ఉపాధ్యాయ సంఘాలు
తక్షణమే జీతాలు విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్ చేశాయి. దసరా అతి పెద్ద పండగ అని, మూడో తేదీ వచ్చినా 20శాతం కూడా వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమని పేర్కొన్నాయి. ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!