పీజీ వైద్య విద్యార్థులకు తప్పనిసరి గ్రామీణ/ప్రభుత్వ సర్వీస్
పీజీ వైద్య విద్యార్థులకు మరోసారి గ్రామీణ/ప్రభుత్వ సేవను ఏడాది పాటు తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు మరోసారి గ్రామీణ/ప్రభుత్వ సేవను ఏడాది పాటు తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ‘ఎ’ కేటగిరిలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సేవ చేయాల్సి ఉంటుందని ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ద్వారా ప్రాధాన్య క్రమంలో తొలుత వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే జిల్లా/సామాజిక/ప్రాంతీయ ఆసుపత్రుల్లో, అనంతరం బోధనాసుపత్రుల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తారు. ప్రవేశాల సమయంలోనే విద్యార్థుల నుంచి వ్యక్తిగత ‘బాండ్’ తీసుకుంటారు. మధ్యలో చేయనంటే రూ.40లక్షలు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు రూ.50లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే 707 మంది, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా (‘ఎ’ కేటగిరీ) కింద చేరే 1,142 మంది విద్యార్థులు దీని పరిధిలోకి వస్తారు. మేనేజ్మెంట్ కోటాలో చేరే విద్యార్థులను మినహాయించారు. 2022-23లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు పీజీ వైద్య విద్యను 2025లో పూర్తి చేసిన బయటకు వస్తారు. వీరు వెంటనే లేదా కోర్సు పూర్తయిన 18 నెలల్లోగా పనిచేయాల్సి ఉంటుంది. జాతీయ కోటాలో కళాశాలల్లో చేరే విద్యార్థులకు సంబంధించి ఉత్తర్వుల్లో ఏమీ పేర్కొనలేదు. సూపర్ స్పెషాలిటీ వైద్యులకు నెలకు రూ.లక్ష, స్పెషాలిటీకి (పీజీ క్లినికల్) రూ.75,000, స్పెషాలిటీ (పీజీ పారా క్లినికల్) వైద్యులకు రూ.75వేల చొప్పున గౌరవవేతనం ఇచ్చే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో నేరుగా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యాలయం ద్వారా కౌన్సెలింగ్ జరుగుతుందా? కళాశాలల వారి ద్వారా యథావిధిగా కొనసాగించాలా? అన్న దానిపై పరిశీలన జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు. -
ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి పేర్కొన్నారు.