బంగాళాఖాతంలో అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళ, బుధవారాల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు ప్రయాణిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించిందని వివరించారు.

Published : 04 Oct 2022 05:17 IST

కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

ఈనాడు, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళ, బుధవారాల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు ప్రయాణిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించిందని వివరించారు. ఈ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని