‘విస్తరణ’ టెండర్లపై నేతల కన్ను
సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనుల టెండర్లను తెరిచే ప్రక్రియను అధికారులు పదేపదే వాయిదా వేస్తున్నారు. సాంకేతిక బిడ్లను వెల్లడించడానికి సోమవారం గడువు ముగియగా, చివరి నిమిషంలో ఈనెల 17కి వాయిదా వేశారు.
తెరుచుకోని పులివెందుల హైవే విస్తరణ బిడ్
ఒత్తిళ్లు పనిచేస్తున్నాయేమోనని గుత్తేదారువర్గాల్లో చర్చ
ఈనాడు, అమరావతి: సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనుల టెండర్లను తెరిచే ప్రక్రియను అధికారులు పదేపదే వాయిదా వేస్తున్నారు. సాంకేతిక బిడ్లను వెల్లడించడానికి సోమవారం గడువు ముగియగా, చివరి నిమిషంలో ఈనెల 17కి వాయిదా వేశారు. దీనికి తెరవెనుక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఇద్దరు బలమైన నేతలు పనులపై ఆసక్తి చూపడమే ఇందుకు కారణమని గుత్తేదారులు చర్చించుకుంటున్నారు. ఇవీ వివరాలు... వైయస్ఆర్ జిల్లా ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా బి.కొత్తపల్లి వరకు 56 కి.మీ. మేర జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.891.44 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. సెప్టెంబరు 2తో ముగియాల్సిన టెండర్ల దాఖలు గడువును... మూడుసార్లు పెంచి, చివరకు అదేనెల 23న ముగించారు. బిడ్లను సెప్టెంబరు 26న తెరిచి, టెండర్లు వేసిన వారి వివరాలు ప్రకటిస్తామని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) అధికారులు ప్రకటించారు. అయితే... బిడ్లు తెరిచే తేదీని ఈ నెల 3(సోమవారం)కు వాయిదా వేశారు. షరామామూలుగా బిడ్లు తెరిచే తేదీని మరోసారి ఈనెల 17కు మార్చినట్లు గుత్తేదారులకు మెయిల్లో సాయంత్రం సమాచారం పంపారు.
ఎందుకీ వాయిదాలు?
టెండర్లను తెరిచే తేదీని పదేపదే వాయిదా వేస్తుండటంతో గుత్తేదారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పనులు చేసేందుకు కొన్ని ఉత్తరాది సంస్థలు బిడ్లు వేసినట్లు తెలుస్తోంది. అదేసమయంలో ముఖ్యమంత్రికి సన్నిహితుడైన, పులివెందులకే చెందిన ఓ ప్రజాప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వంలో నంబరు-2గా వ్యవహరిస్తున్న మంత్రి కుమారుడైన మరో ప్రజాప్రతినిధి ఇద్దరూ కలిసి... ఈ టెండరును సొంతం చేసుకునేందుకు మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరోవైపు సీఎం సొంత నియోజకవర్గంలో జరిగే పనికావడంతో.. తమపై ఒత్తిళ్లు తెచ్చి టెండర్లు దాఖలు చెయ్యనివ్వలేదంటూ కొన్ని గుత్తేదారు సంస్థలు, దిల్లీలోని మోర్త్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
తెలంగాణలో వెంటనే తెరుస్తున్న టెండర్లు
తెలంగాణలో మోర్త్ పిలిచే టెండర్లను వెన్వంటనే తెరుస్తున్నారు. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 79.3 కి.మీ. మేర జాతీయ రహదారి నిర్మాణానికి రూ.630 కోట్ల అంచనాతో మోర్త్ టెండర్లు పిలిచింది. దీనికి బిడ్ల దాఖలు గడువు సెప్టెంబరు 26న ముగిసింది. మరుసటి రోజే (27న) వాటిని తెరిచి 14 మంది టెండర్లు వేసినట్లు ప్రకటించారు. ఏపీలో రాష్ట్రంలో మాత్రం బిడ్లను సకాలంలో తెరవడం లేదని మోర్త్ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మోర్త్ ఏపీ ప్రాంతీయ అధికారి (ఆర్వో) ఎస్కే సింగ్ను వివరణ కోరేందుకు ఫోనులో సంప్రదించగా.. ఆయన స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా