అన్నగారి భోజనశాల... జనతా వస్త్రాలు
ఎన్టీఆర్కు వీరాభిమాని అయిన ఉయ్యూరు శ్రీనివాస్... ప్రజాసేవలోనూ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు. తన అభిమాన నేత పేరుతో రాష్ట్రంలో అన్నగారి భోజనశాలలు నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. జనతా వస్త్రాలనూ అందిస్తున్నారు.
విదేశీ విద్యకు రూ.40 లక్షల వడ్డీలేని రుణం
ప్రతి నెలా రెండు వైద్య శిబిరాలు
ఎన్టీఆర్ స్ఫూర్తిగా ప్రజలకు సేవలు
‘ఈనాడు’తో ప్రవాసాంధ్రుడు ఉయ్యూరు శ్రీనివాస్
ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్కు వీరాభిమాని అయిన ఉయ్యూరు శ్రీనివాస్... ప్రజాసేవలోనూ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు. తన అభిమాన నేత పేరుతో రాష్ట్రంలో అన్నగారి భోజనశాలలు నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. జనతా వస్త్రాలనూ అందిస్తున్నారు. విదేశీ విద్యను అందుకోలేని పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 50 వేల డాలర్ల(రూ.40 లక్షలు) వడ్డీలేని రుణం అందిస్తున్నారు. గుంటూరు జిల్లా వేజెండ్లకు చెందిన శ్రీనివాస్ అమెరికాలో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. అక్కడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటుచేశారు. దానికి తన సొంత ఆదాయం నుంచి కోట్ల రూపాయలను కేటాయించారు. అసోసియేషన్ ద్వారా అందిస్తున్న సేవలను మంగళవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’కి వివరించారు. ‘సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజలకు కూడు, గూడు, గుడ్డ కల్పించేందుకు ఎన్టీఆర్ కృషి చేశారు. రాష్ట్రంలో, దేశంలో నేడు అమలవుతున్న వివిధ పథకాలలో చాలావరకు నాడు ఆయన ప్రవేశపెట్టిన పథకాల కొనసాగింపులే. వాటిలో కొన్ని కనుమరుగవుతున్న నేపథ్యంలో మళ్లీ ప్రజలకు గుర్తు చేయాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.
అమెరికాలోని విద్యార్థులకు అండగా వడ్డీలేని రుణం
‘ప్రతిభ కలిగిన ఎంతోమంది విద్యార్థులు విదేశీ చదువులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రైతు కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల వారికైతే పొలాల తాకట్టుపైనా రుణాలిచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ చూశాకే... నాలో ఆలోచన మొదలైంది. అమెరికా వచ్చే విద్యార్థులకు ‘ఎన్టీఆర్ విద్య’ పేరుతో రూ.40 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తున్నాం. ఈ ఏడాది 20 మందికి ఇచ్చాం. వచ్చే ఏడాది మరింత ఎక్కువ మందికి ఇస్తాం’ అని శ్రీనివాస్ వివరించారు. ‘బ్యాంకు రుణాలు పొందలేని విద్యార్థులకే ఈ సౌకర్యం కల్పిస్తాం. వారి వర్సిటీలకే నిధులను నేరుగా జమ చేస్తాం. ఉద్యోగంలో చేరాక అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది’ అని చెప్పారు.
ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టగలిగితే...
‘సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి ఎన్టీఆర్... ఆయన ఆశయాల్లో మొదటిది పేదలకు కడుపు నిండా ఆహారం అందించడం. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు లేవు. అందుకే అన్నగారి భోజనశాలలను ఏర్పాటు చేస్తున్నాం’ అని శ్రీనివాస్ వివరించారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్, తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని జేకేసీ కళాశాల వద్ద అందుబాటులోకి తెచ్చాం. హిందూపురంలో అన్నగారి భోజనశాలకు నిధులిస్తున్నాం. ఒక్కోచోట రోజుకు 500 మందికి ఆహారం అందిస్తున్నాం. హిందూపురంలో భోజనశాలను బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించాం. దీనికి ఊహించని స్పందన లభించింది. అందుకే కొనసాగించాలని నిర్ణయించాం’ అని వివరించారు.
పేదలకు అన్నగారి జనతావస్త్రాలు
‘అన్నగారి ఆశయాల్లో మరోటి పేదలకు వస్త్రాలు అందించడం.. ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ నెల 7న 15 వేల మంది మహిళలకు చీరలను ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. భవిష్యత్తులో అవసరమైన అన్నిచోట్ల వస్త్రాలను అందిస్తాం’ అని ప్రకటించారు.
డిసెంబరులో మొబైల్ ఆసుపత్రి
‘ప్రతినెలా రెండు వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. డిసెంబరులో మొబైల్ ఆసుపత్రి ప్రారంభించబోతున్నాం. ఒక్కో గ్రామానికి ఒక్కో రోజు చొప్పున వాహనం వెళుతుంది. ప్రజలకు వైద్య సేవలు అందిస్తుంది. రెండు అంబులెన్స్లను సైతం తెప్పిస్తున్నాం. డిసెంబరు నుంచి సేవలను మరింత మెరుగు పరుస్తాం’ అని ఆయన వెల్లడించారు. ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంస్థకు ప్రస్తుతం నేనే సొంతంగా నిధులు సమకూరుస్తున్నా. నాలాంటి ఎంతోమంది ఇలా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో వారితో కలిసి నడుస్తాం’ అని శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా అమెరికాలో ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ సినిమాలను ప్రదర్శిస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?