రిజిస్ట్రేషన్ల మెరుగుదలకు ఐఏఎస్ల కమిటీ
దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, సులభతర విధానాలపై అధ్యయనం కోసం ఐఏఎస్ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి
రవాణా శాఖలో ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ఆదాయ శాఖల పనితీరుపై సీఎం జగన్ సమీక్ష
ఈనాడు, అమరావతి: దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, సులభతర విధానాలపై అధ్యయనం కోసం ఐఏఎస్ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నాటుసారా తయారీ వృత్తిలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలన్నారు. రవాణాశాఖలో ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆదాయాలను సమకూర్చే ప్రభుత్వ శాఖల పనితీరును సీఎం జగన్ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ వసూళ్లు పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. లీకేజీల నిరోధానికి ప్రముఖ సంస్థల నుంచి సాయం తీసుకోవాలని, పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శకత విధానాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నివేదికలు తెప్పించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి రోజూ నివేదికలు తెప్పించాలి. నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పొందే మార్గాలపై పరిశీలనకు ఐఏఎస్లు కృష్ణబాబు, రజత్భార్గవ, నీరబ్కుమార్ ప్రసాద్, గుల్జార్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. నాన్-రిజిస్ట్రేషన్ విధానాలు పూర్తిగా తొలగిపోవాలి. ఆస్తుల విలువ మదింపులో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులను పరిశీలించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మైనింగ్ కోసం లీజు లైసెన్సులు పొందినవారే ఆ కార్యకలాపాలు కొనసాగించాలి. ఒకవేళ చేయకుంటే అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టాలి. ప్రతినెలా సమీక్షించి, ఆదాయం పెరుగుతూ ఉండేలా చూడాలి. రవాణాశాఖలో పన్ను పెంచడమే పరిష్కారం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి. ఇతర రాష్ట్రాల కంటే సానుకూల పరిస్థితులను సృష్టించడం ద్వారా ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్ సూచించారు.
లక్ష్యంలో 94.47% సాధించాం: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు వరకూ జీఎస్టీ, ఇతర శాఖల ఆదాయ లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా ఇప్పటివరకూ రూ.25,928 కోట్లు (94.47%) సాధించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ‘జీఎస్టీ వసూళ్లు దేశవ్యాప్తంగా 27.8% ఉండగా రాష్ట్రంలో 28.79%. పన్ను ఎగవేతదారుల నిరోధానికి హెచ్ఓడీ కార్యాలయంలో డేటా ఎనలిటిక్స్ సెంటర్ ఏర్పాటుచేశాం. గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు నాటికి రూ.1,174 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇదే సమయానికి రూ.1,400 కోట్లు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 43% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!