ముంచెత్తిన వాన
రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జొన్న, పెసర, మినుము, కూరగాయల పొలాల్లో నీరు నిలిచి మొక్కలు ఉరకెత్తుతున్నాయి.
రోడ్లు తెగిపోయి జనజీవనం అస్తవ్యస్తం
ప్రకాశంలో పిడుగుపాటుకు ఇద్దరి మృతి
వివిధ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం
పత్తి, మిర్చి, కూరగాయ, మెట్ట పంటలకు తీవ్ర నష్టం
వరికి ముంపు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జొన్న, పెసర, మినుము, కూరగాయల పొలాల్లో నీరు నిలిచి మొక్కలు ఉరకెత్తుతున్నాయి. వివిధ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో వరద నీరు రోడ్లపైకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి, కురిచేడులో బుధవారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. వైయస్ఆర్ జిల్లాలో ముద్దనూరు-జమ్మలమడుగు రహదారి కొట్టుకుపోయి 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం పూత దశలో ఉన్న పత్తి తీవ్రంగా దెబ్బ తిన్నది.
ఈ పంటపై రైతులు భారీగా పెట్టుబడి పెట్టారు. మొదటి దశ పత్తి వస్తుందని ఆశిస్తున్న తరుణంలో వర్షాలు వారికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. మిర్చి మొక్కలను ఇప్పుడిప్పుడే నాటుతున్నారు. ఈ సమయంలో నీరు నిలవడంతో మొక్కలు ఎర్రబారుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో నాటేందుకు ఒక్కో మిర్చి మొక్క రూ.1.50 నుంచి రూ.3 చొప్పున కొనుగోలు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవల గోదావరికి వచ్చిన వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోగా... ఇప్పుడు భారీ వర్షాలతో కూరగాయలు, కంద ఇతర మెట్ట పంటలకు మరోసారి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళంలో జిల్లాలో కొన్నిచోట్ల వరి నీట మునిగింది. రాయలసీమలో మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, కూరగాయల పంటలపై ప్రభావం పడింది. అనంతపురం జిల్లాల్లో ద్రాక్ష తోటలు నేలకొరిగాయి. ఎగువ నుంచి 79,350 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 72,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, కృష్ణా డెల్టాలోని కుడి, ఎడమ కాల్వలకు 7,050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
ఉమ్మడి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, తాడికొండ, తుళ్లూరు, తాడేపల్లి తదితర మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 380 ఎకరాల్లో నీటమునిగాయి. తాడికొండ, తాడేపల్లి మండలాల్లో వరి, పసుపు, అరటి పంటలకు... వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో అధికంగా పత్తి, మిరప పంటలకు నష్టం వాటిల్లింది.
ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ప్రస్తుతం పత్తి పూత, పిందే దశలో ఉంది. వర్షాలకు పూత రాలిపోతోంది.
ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు, కొండపి, ఎస్ఎన్పాడు, దర్శి నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దర్శి, కురిచేడు మండలాల్లో ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటుకు మృతి చెందారు.
అనంతపురం నగరంలోని నడిమివంకకు వరద పోటెత్తింది. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లిలో ద్రాక్ష పంట నేలకొరిగింది. వైయస్ఆర్ జిల్లా చెన్నూరు, ఖాజీపేట, కమలాపురం, మైదుకూరు మండలాల్లో పంటలు నేలకొరిగాయి. వరికి తీవ్ర కష్టం కలిగింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ, పాలకొల్లు, ఆచంట తదితర నియోజకవర్గాల్లో తోట పంటల్లో వర్షపు నీరు నిలిచింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో వరదతో దాదాపు 1000 ఎకరాల వరి పంట నీట మునిగింది. విజయవాడలో గురువారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీరంతా రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గొల్లపూడి సెంటర్ నుంచి బస్టాండ్ వరకు ప్రయాణానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు వాగు ఉప్పొగడంతో కొలిజర్ల-గంపలగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం అనాసాగరం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. విశాఖలోని రామకృష్ణపురం ప్రాంతం ముంపునకు గురైంది. కేంద్ర కారాగార పరిసరాలలోని వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, గోపవరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, ఇళ్లలోకి నీరు చేరింది. పెన్నా, పాపాఘ్ని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒంగోలులో పోతురాజు కాల్వ ఉప్పొంగడంతో సమీపంలోని నెహ్రూనగర్, ప్రకాష్నగర్ కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. అనంతపురంలోని నడిమివంక, రజకనగర్లకు వరద పోటెత్తడడంతో సమీప ప్రాంతాలు నీట మునిగాయి.
నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శని వారాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం