Vijayawada: విజయవాడ గేట్‌వే హోటల్‌.. ఇక నుంచి వివంత

విజయవాడ ఎంజీ రోడ్డులోని గేట్‌వే హోటల్‌ ఇకనుంచి వివంత పేరుతో సేవలందిస్తుంది. వివంత లోగోను హోటల్‌ సీఎండీ మలినేని రాజయ్య, మలినేని గిరిధర్‌ గోపాల్‌, విజయ్‌ ఆవిష్కరించారు.

Updated : 07 Oct 2022 09:34 IST

విజయవాడ (లబ్బీపేట), న్యూస్‌టుడే: విజయవాడ ఎంజీ రోడ్డులోని గేట్‌వే హోటల్‌ ఇకనుంచి వివంత పేరుతో సేవలందిస్తుంది. వివంత లోగోను హోటల్‌ సీఎండీ మలినేని రాజయ్య, మలినేని గిరిధర్‌ గోపాల్‌, విజయ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ నగరంలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఏర్పాటుచేయడం, దీనికి ఇటీవలే జాతీయ పర్యాటక అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఈ హోటల్‌లో బస చేశారని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించడం, వినియోగదారుల నుంచి ఆదరణ పొందడం వల్లే జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. కార్యక్రమంలో హోటల్‌ జీఎం అంకిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని