ఆసుపత్రులు రావట్లేదు!
‘‘ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు.. రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ కార్పొరేషన్లలో మొత్తం 16 ప్రాంతాల్లో.. 30-50 ఎకరాల్లో హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన.
భూములు ఉచితంగా ఇస్తామన్నా స్పందించని కార్పొరేట్ యాజమాన్యాలు
లక్ష్యం రూ.8వేల కోట్ల పెట్టుబడులు.. వచ్చింది రూ.300 కోట్లు
హెల్త్హబ్ల ఏర్పాటు తీరిదీ
ఈనాడు, అమరావతి: ‘‘ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు.. రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ కార్పొరేషన్లలో మొత్తం 16 ప్రాంతాల్లో.. 30-50 ఎకరాల్లో హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఒక్కొక్కరికి 5 ఎకరాలు కేటాయిస్తాం. ఒక్కో చోట 5 మందికి అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంటే 10 మందికి అవకాశం కల్పిస్తాం. మూడేళ్లలో వారు రూ.100 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టాలి. సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి. భూములు ఉచితంగా ఇస్తాం. ప్రైవేటు భాగస్వామ్యంతో కార్పొరేట్ వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కనీసం 80 కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చే అవకాశం ఉంది’’ హెల్త్ హబ్ల ఏర్పాటుపై సీఎం జగన్ చెప్పిన మాటలు ఇవి.
రాష్ట్రంలో 16 హెల్త్ హబ్ల ఏర్పాటుకోసం ప్రభుత్వం పిలిచిన టెండర్లకు స్పందన కరవైంది. మూడు సార్లు టెండర్లు పిలిస్తే.. మూడు చోట్ల మాత్రమే ఒక్కో బిడ్ చొప్పున దాఖలైంది. దీంతో మిగిలిన 13 చోట్ల టెండర్ల ప్రక్రియను నిలిపేసి.. కొత్త విధివిధానాలను అధికారులు రూపొందిస్తున్నారు. హెల్త్ హబ్ల ఏర్పాటుకు మొదటి సారి టెండరు ప్రకటన జారీ చేస్తే ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. భూముల విలువ మొత్తానికి సరిపడా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్న నిబంధనపై ఆసుపత్రుల యాజమాన్యాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తర్వాత దీన్ని సవరించి బిడ్ సెక్యూరిటీ కింద రూ.10 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని రెండోసారి టెండరు ప్రకటన ఇస్తే కేవలం కర్నూలు, ఒంగోలు జిల్లాల నుంచి మాత్రమే స్పందన వచ్చింది. మూడో సారి టెండరు ప్రకటనకు రాజమహేంద్రవరంలో ఆసుపత్రి ఏర్పాటుకు ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. ఈ హబ్ల్లో ఏర్పాటయ్యే ఆసుపత్రుల ద్వారా సుమారు రూ.8 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే.. రూ.300 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రావటం గమనార్హం.
మూడో సారీ అంతే..
ప్రభుత్వం నగరానికి దగ్గరలో 5 ఎకరాల భూమి ఇస్తామంది. రెండేళ్ల తర్వాత వాటిని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది. ప్రభుత్వ ప్రకటనకు కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు వరుస కడతారని అధికారులు భావించగా పరిస్థితి తారుమారైంది. హెల్త్ హబ్ల ఏర్పాటుకు ఈ ఏడాది మార్చి 30న మూడోసారి టెండరు ప్రకటనను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా స్పందన రాలేదు. గడువు పొడిగించినా పరిస్థితిలో మార్పు లేదు. మూడేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనతో పాటు కనీసం 100 పడకలు ఉండాలని.. మొత్తం పడకల్లో 50 శాతం ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాలన్న నిబంధన ఉండటంతోనే ఆసుపత్రుల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన మూడు బిడ్లకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుని.. మిగిలిన 13 హబ్లకు సంబంధించి మరోసారి టెండరు ప్రకటన జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్