Vizag: కాబోయే అల్లుడికి కనులుచెదిరే విందు!

కాబోయే అల్లుడ్ని అత్తవారు పండగకు పిలిచి, 125 రకాల వంటకాలతో విందు భోజనం పెట్టారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చైతన్యకు విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో వచ్చే ఏడాది మార్చి 9న వివాహం చేయాలని నిర్ణయించారు.

Updated : 07 Oct 2022 07:29 IST

125 వంటకాలు వడ్డించిన అత్తింటివారు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: కాబోయే అల్లుడ్ని అత్తవారు పండగకు పిలిచి, 125 రకాల వంటకాలతో విందు భోజనం పెట్టారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చైతన్యకు విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో వచ్చే ఏడాది మార్చి 9న వివాహం చేయాలని నిర్ణయించారు. నిశ్చితార్థం అయ్యాక తొలి పండగ దసరాకు అత్తవారు అల్లుడ్ని ఆహ్వానించి, రకరకాల వంటకాలతో విందిచ్చారు. 95 వరకు బయట నుంచి కొని.. మిగతావన్నీ ఇంట్లోనే తయారు చేశారు. అన్ని వంటకాలు చూసిన ఆ అల్లుడు వాటిలో కొన్నింటి పేర్లూ తెలియవని ఆశ్చర్యపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని