సంక్షిప్త వార్తలు(6)
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి పీహెచ్సీకి కొత్త భవనం నిర్మిస్తామని మంత్రి విడదల రజిని తెలిపారు. ఈమేరకు విజయవాడలో శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... దేవరాపల్లి పీహెచ్సీలోని ప్రసూతి గదిలో నీటి లీకేజీపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు.
దేవరాపల్లి పీహెచ్సీకి కొత్త భవనం
మంత్రి రజిని వెల్లడి
ఈనాడు, అమరావతి: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి పీహెచ్సీకి కొత్త భవనం నిర్మిస్తామని మంత్రి విడదల రజిని తెలిపారు. ఈమేరకు విజయవాడలో శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... దేవరాపల్లి పీహెచ్సీలోని ప్రసూతి గదిలో నీటి లీకేజీపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు. నాడు-నేడు కింద రూ.50 లక్షలతో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. డిప్యూటీ సీఎం సూచన మేరకు రూ.2.5 కోట్లతో పీహెచ్సీకి కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఇటీవల మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో శిశువు విషయంలో జరిగిన పొరపాటుకు బాధ్యులైన వారి నుంచి ఇప్పటికే వివరణ తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చికిత్సలు చేయించుకోవడాన్ని విలేకరులు ప్రస్తావించగా అది వారి వ్యక్తిగతమన్నారు.
13 నుంచి ప్రజానాట్య మండలి సాంస్కృతిక కార్యక్రమాలు
ఈనాడు, అమరావతి: సీపీఐ జాతీయ మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 17వరకు విజయవాడలో కళా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల బోచర్ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13న సాయంత్రం 4గంటలకు లెనిన్ సెంటర్లో ఆట, పాట, మాట, కళాకారుల ధూంధాం నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రముఖ ప్రజావాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాల్గొంటారని పేర్కొన్నారు. 14నుంచి రైల్వే స్టేషన్కు సమీపంలోని హనుమంతరాయ గ్రంథాలయ హాలులో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
పాలనను ప్రజలకు చేరువ చేయండి
ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు సీఎం సూచన
ఈనాడు, అమరావతి: ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువ చేసేలా పని చేయాలని ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు సీఎం జగన్ సూచించారు. సామాన్యుడికి సైతం పాలన అందుబాటులో ఉండేలా చూడాలని మార్గనిర్దేశనం చేశారు. శుక్రవారం 2021 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారుల బృందం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. అంతకుముందు ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె.మీనాను సైతం కలిశారు. అనంతరం తాడికొండ గ్రామంలో పర్యటించి ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పరిశీలించారు. అధికారుల బృందంలో పి.ధాత్రిరెడ్డి, మేఘ స్వరూప్, ప్రఖర్జైన్, విద్యాధరి, శివనారాయణ్శర్మ, అశుతోష్ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్ మీనా, సూరపాటి ప్రశాంత్కుమార్ ఉన్నారు.
సీపీఎస్ అమలుకు ముందు ఎంపికైన ఉద్యోగుల జాబితా సేకరణ
ఈనాడు, అమరావతి: కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) అమల్లోకి వచ్చిన 1 సెప్టెంబరు 2004కు ముందు ఉద్యోగానికి ఎంపికై ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తోంది. ఇప్పటికే అయా విభాగాలు అందించిన డేటాలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేసి, తుది జాబితాను ఈనెల 12లోపు అందించాలని అన్ని విభాగాధిపతులు, సచివాలయ అధికారులను కోరింది. కొన్ని నియామకాల్లో ఆగస్టు 31, 2004కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తయినా సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో చేరారు. సీపీఎస్ అమల్లోకి రాకముందే ఉద్యోగాల ఎంపిక పూర్తయినందున వారికి పాత పింఛన్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఆత్మవిశ్వాసమే తోడుగా అడుగేయి ముందుకు!
వైకల్యముందని బాధ పడకుండా ఏదోఒకటి సాధించాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్కు చెందిన అన్నాచెల్లెళ్లు శంకర్, సుజాత. ఎవరి మీద ఆధారపడకుండా ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులది మేనరికం కావడంతో వీరు వైకల్యంతో జన్మించారు. శంకర్కు కాళ్లు, చేతులు సరిగ్గా ఎదగలేదు. మూడడగుల ఎత్తుకు మించి ఉండరు. సుజాతకు రెండు కాళ్లు లేవు. అయినా కుంగిపోకుండా చదువులో దూసుకెళ్తున్నారు. డీఎడ్ పూర్తిచేసిన శంకర్ ఏడాది పాటు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్టీకి సన్నద్ధమవుతున్నారు. డిగ్రీ పూర్తిచేసిన సుజాత పీజీ చేసేందుకు ప్రవేశ పరీక్ష రాశారు. చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు మహబూబ్నగర్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో వసతితో కూడిన సీటును కోరడానికి సుజాత సోదరుడితో కలిసి ఇటీవల ఇలా ఆ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వచ్చారు. తప్పకుండా సీటు ఇస్తానని మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు వారికి హామీ ఇచ్చారు. వారు ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ‘ఈనాడు’ తీసిన చిత్రమిది.
- ఈనాడు, మహబూబ్నగర్
ఏపీఈడబ్ల్యూఐడీసీలో ఆరు నెలలుగా అందని వేతనాలు
ఈనాడు, అమరావతి: ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. ఈ కార్పొరేషన్ ఇంజినీరింగ్ పనులు చేస్తుంది. ఈ పనుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చూసినందుకు ఆయా విభాగాల నుంచి కొంత మొత్తం ఛార్జీల కింద తీసుకుంటుంది. ఆ నిధులతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కొంతకాలంగా ‘నాడు-నేడు’ పనులు, టెండర్ల బాధ్యతలను ఈ కార్పొరేషన్ చూస్తోంది. ‘నాడు-నేడు’ పనులకు సంబంధించి ఎక్కువ నిధులు రాకపోవడంతో జీతాలు ఇవ్వడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి