ఒంగోలు ఎంపీ మాగుంటకు సోదర వియోగం

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సుధాకర్‌రెడ్డి (73) అనారోగ్యంతో శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు.

Published : 08 Oct 2022 03:40 IST

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సుధాకర్‌రెడ్డి (73) అనారోగ్యంతో శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. సుధాకర్‌రెడ్డి ఆయనకు చిన్న సోదరుడు కాగా దివంగత మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి పెద్ద సోదరుడు. సుధాకర్‌రెడ్డి ఇటు కుటుంబ వ్యవహారాల్లోనూ, అటు వ్యాపార, రాజకీయ, ప్రజాసేవా కార్యక్రమాల్లోనూ ఎంతో కీలకంగా వ్యవహరించేవారు. ఆయన ప్రోత్సాహంతోనే 1991లో సుబ్బరామిరెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. సోదరుడి మరణం తర్వాత వదిన పార్వతమ్మ, ఆ తర్వాత మరో సోదరుడైన ప్రస్తుత ఎంపీ శ్రీనివాసులురెడ్డిలను రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహించారు. చెన్నైలోని స్వగృహం నుంచి శనివారం ఆయన అంతిమయాత్ర నిర్వహించనున్నారు. సుధాకర్‌రెడ్డి వివిధ సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. చెన్నైలో పలు సినిమాహాళ్లు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని