పోలవరంతో ముంపు ముప్పు ఉండదు
పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ వరద వల్ల ఎలాంటి ముంపు సమస్య ఉండదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడే ముంపు సమస్యపై మళ్లీ అధ్యయనం చేయాలన్న మూడు రాష్ట్రాల డిమాండ్ను తోసిపుచ్చింది.
కేంద్ర జలసంఘం ఛైర్మన్ స్పష్టీకరణ
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ వరద వల్ల ఎలాంటి ముంపు సమస్య ఉండదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడే ముంపు సమస్యపై మళ్లీ అధ్యయనం చేయాలన్న మూడు రాష్ట్రాల డిమాండ్ను తోసిపుచ్చింది. పోలవరం ప్రభావిత రాష్ట్రాలకు ఉన్న సాంకేతిక అభ్యంతరాలను ఈ నెల 19లోగా తెలియజేయాలని, వాటిని నివృత్తి చేస్తామని భరోసా ఇచ్చింది. దిల్లీలో శుక్రవారం కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన పోలవరం ముంపు, స్పిల్ వే డిజైన్లు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సైతం పాల్గొన్నారు. ముంపు సమస్య, తాజా వరదలతో ఏర్పడ్డ ఇబ్బందులు తదితర అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రతినిధులు తమ వాదనలను వినిపించారు. ప్రధానంగా గరిష్ఠంగా ఎంత వరదను అంచనా వేసి స్పిల్వే నిర్మిస్తున్నారు? బ్యాక్ వాటర్ ప్రభావం ఎంత ఉంటుంది? ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు అనే రెండు ప్రధాన అంశాలు ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు వల్ల అన్ని రాష్ట్రాలకు ప్రయోజనమే అని జలసంఘం ఛైర్మన్ గుప్తా పేర్కొన్నారు.
పోలవరాన్ని ప్రత్యేకంగా చూడకండి..
‘పోలవరాన్ని ప్రత్యేకంగా చూడకూడదు. అన్ని జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో ఇక్కడా అదే విధానం అనుసరించాలి’ అని ఆంధ్రప్రదేశ్ సుస్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాలు పోలవరం విషయంలో అధ్యయనాలు చేయాలంటున్నట్లుగా అన్ని జాతీయ ప్రాజెక్టుల్లోనూ చేశారా? అని ఏపీ అధికారులు ప్రశ్నించారు. అలా అన్ని జాతీయ ప్రాజెక్టుల్లోనూ చేయగలరా? అని కూడా ప్రస్తావించారు. ఏపీ తరఫున జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీరు సుధాకర్బాబు హాజరయ్యారు. ఉమ్మడి సర్వేకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. ఇందుకు ఆయా రాష్ట్రాలు సహకరించాలని పేర్కొంది.
అంత వరద వచ్చే అవకాశమే లేదు
గోదావరిలో గరిష్ఠంగా 50 లక్షల వరద వస్తుందని ఐఐటీ హైదరాబాద్, 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ రూర్కీ అధ్యయనాల గురించి ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రస్తావించగా ఏపీ అభ్యంతరం తెలిపింది. గోదావరి చరిత్రలో ఇంతవరకు 36 లక్షల క్యూసెక్కుల గరిష్ఠ వరద మాత్రమే వచ్చిందని కేంద్ర జలసంఘం కూడా పేర్కొంది. గరిష్ఠంగా 58 లక్షల క్యూసెక్కుల వరద అంచనాలున్నాయని తదనుగుణంగా స్పిల్ వే డిజైన్లు, బ్యాక్ వాటర్ ప్రభావం ఎదుర్కొనేలా చర్యలు ఉండాలని ఛత్తీస్గఢ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ వి.కె.ఇంద్రజిత్, చీఫ్ ఇంజినీరు నగారియా తదితరులు పేర్కొన్నారు. స్పిల్ వే డిజైన్లకు 58 లక్షల గరిష్ఠ వరదనే పరిగణనలోకి తీసుకోవాలని ఒడిశా అభిప్రాయపడింది. కేంద్ర జలసంఘం, ఏపీ నిర్వహించిన సర్వేకు కొన్ని పరిమితులు ఉన్నాయని ఒడిశా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ముంపు ఏర్పడే ప్రాంతాల్లో జాయింట్ సర్వేకు, ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా అంగీకరించాలని కేంద్ర జలసంఘం కోరింది. ఏపీ కూడా ముంపు ప్రాంతాల గుర్తింపునకు సంయుక్త సర్వేకు ఒడిశా అంగీకరించాలని విన్నవించింది. ఆపరేషన్ ప్రొటోకాల్, హైడ్రాలజీ వంటి అంశాలు తేలే వరకు సంయుక్త సర్వేకు తాము అంగీకరించబోమని ఒడిశా పేర్కొంది.
మళ్లీ అధ్యయనం చేయాలి: తెలంగాణ
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేయాలని తెలంగాణ కోరింది. తాజా వరదల నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం జరగాలని కోరింది. 2022 వరదల వల్ల ప్రభావితమైన 28,000 ఆవాస ప్రాంతాలు, 11,000 కుటుంబాలు, 103 గ్రామాలు సరైన బ్యాక్ వాటర్ అధ్యయనాలు అవసరమంటున్నాయని తెలంగాణ పేర్కొంది. వివిధ కేంద్ర జలసంఘం అధ్యయనాలు, 2022 జులైలో ఏర్పడ్డ వరదలను పోలుస్తూ తెలంగాణ అధికారులు అనేక అంశాలు ప్రస్తావించారు. పోలవరంలో గరిష్ఠ నీటి మట్టం వద్ద నీరు నిలబడి ఉన్నప్పుడు ఏర్పడే ప్రభావం కూడా కీలకమని తెలంగాణ పేర్కొంది. గోదావరికి ఎగువన రెండువైపులా ఉన్న అనేక వాగులు, వంకలకు సంబంధించి జాయింట్ సర్వే చేయాలని తెలంగాణ కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?