విద్యుత్తు బకాయిల చెల్లింపులో మాయాజాలం
ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల విద్యుత్తు బకాయిల కింద ప్రభుత్వం చెల్లిస్తోందనడంలో నిజం లేదని పలువురు సర్పంచులు అభిప్రాయపడ్డారు.
‘ఈనాడు’తో పలు పార్టీల సర్పంచులు
ఈనాడు, అమరావతి: ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల విద్యుత్తు బకాయిల కింద ప్రభుత్వం చెల్లిస్తోందనడంలో నిజం లేదని పలువురు సర్పంచులు అభిప్రాయపడ్డారు. అలా చెల్లిస్తే బకాయిల మొత్తం తగ్గకపోగా, ఇంకా ఎక్కువ ఎందుకు చూపిస్తోందని.. అంటే ఏదో మాయ ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేక పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయంటున్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వచ్చిన సర్పంచులు ‘ఈనాడు’తో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే...
బకాయిలు చెల్లిస్తే సరఫరా ఎందుకు నిలిపేస్తున్నారు?
‘ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద చెల్లిస్తున్నామని చెబుతున్నారు. అలా చెల్లిస్తే... అధికారులొచ్చి విద్యుత్తు సరఫరా ఎందుకు నిలిపివేస్తున్నారు? కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమచేస్తే బకాయిలు మేమే దశలవారీగా చెల్లిస్తాం కదా.’
- దేవరకొండ రాము, వైకాపా సర్పంచి, అమృతలూరు, బాపట్ల జిల్లా
తీర్మానం చేసేలోపే మళ్లించారు
‘మా చిన్న పంచాయతీకి ఆర్థిక సంఘం నిధులొచ్చేది అంతంత మాత్రమే. వీటితో చిన్న చిన్న పనులైనా చేద్దామని తీర్మానం చేద్దామనుకునేలోగా 15వ ఆర్థిక సంఘం 2021-22 తొలి విడత విడుదలైన రూ.14 లక్షలు మళ్లించారు. పంచాయతీల్లో నిధుల్లేక ఏడాదిగా వీధులు, కాలువలు శుభ్రం చేసే కార్మికులకు జీతాల్లేవు. వీధిదీపాలు కూడా వేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం.’
- కె.మొషియో, సీపీఎం సర్పంచి, టోకూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా
పంచాయతీల్లో పరిస్థితి అత్యంత దయనీయం
‘గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కార్మికులకు జీతాలివ్వకపోతే వారితో పనులెలా చేయించుకుంటాం. ఆర్థిక సంఘం నిధులతో రూ.4 లక్షల పనులు చేయించాం. నిధుల మళ్లింపుతో బిల్లులు చెల్లించలేదు. పెట్టుబడులు ఇంకా ఎక్కడి నుంచి తెస్తాం?’
- డి.రాముడు, సీపీఎం సర్పంచి, గొల్లమందల తండా, ఎన్టీఆర్ జిల్లా
పనులు చేసి అప్పులపాలయ్యా
‘నాలుగు పనులు చేసి మంచిపేరు తెచ్చుకోవాలనుకున్నాం. ప్రభుత్వాన్ని నమ్మి నిండా మునిగిపోయాం. గ్రామాల్లో పనులు చేసి బిల్లులు రాక అప్పుల పాలయ్యాను. ఇంట్లో బంగారు వస్తువులు తనఖా పెట్టి తీసుకున్న రుణాన్ని సకాలంలో తీర్చనందుకు బ్యాంకులు నోటీసులిచ్చాయి. అరెకరాకుపైగా భూమి అమ్ముకున్నా. ఇదీ నాకు లభించిన బహుమతి.’
- కె.నరేశ్, జనసేన సర్పంచి, చిలుమూరు, బాపట్ల జిల్లా
కనీస సౌకర్యాలకూ ఇబ్బందులే
‘పంచాయతీలో నిధుల్లేక ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడానికీ ఇబ్బందులు పడుతున్నాం. పంపుసెట్ పాడైతే మరమ్మతులు చేయించడానికీ ఆలోచించాల్సి వస్తోంది. రోడ్లు, కాలువలూ శుభ్రం చేయించలేకపోతున్నాం. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు సరిగా జమ చేయకపోవడమే ఈ దుస్థితికి కారణం.’
- డి.రత్నబాబు, వైకాపా సర్పంచి, పిడపర్రు, గుంటూరు జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.