CM Jagan: మే నెలాఖరుకల్లా రోడ్లు బాగు చేయాలి
వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున పట్టణాలు, నగరాల్లో రహదారుల పరిస్థితిని పరిశీలించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, మే నెలాఖరుకల్లా అన్ని రోడ్లు బాగు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
పట్టణాలు, నగరాల్లో రహదారులపై సమీక్షలో సీఎం జగన్
నియోజకవర్గానికో స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్ అభివృద్ధి
ఫ్లెక్సీ వ్యాపారులకు రుణాలిప్పించాలని కలెక్టర్లకు ఆదేశం
ఈనాడు, అమరావతి: వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున పట్టణాలు, నగరాల్లో రహదారుల పరిస్థితిని పరిశీలించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, మే నెలాఖరుకల్లా అన్ని రోడ్లు బాగు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పనుల సీజన్ మొదలవగానే ఈ రహదారులపై దృష్టిపెట్టాలన్నారు. పురపాలక, పట్ట్టణాభివృద్ధి శాఖలపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్శర్మ, ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు.
* చెత్త నిల్వ కేంద్రాల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటించాలి. పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా వీటి నిర్వహణలో ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నామో అవగాహన కల్పించండి.
* మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరుగుతుందా లేదా నిరంతరం పరిశీలించాలి. పురపాలకసంఘాల వారీగా వ్యర్థాల నిర్వహణలో ఉన్న సౌకర్యాలు, మురుగునీటి శుద్ధికి సంబంధించి ఇప్పటికే ఉన్న మౌలిక వసతులు, ఇంకా కల్పించాల్సిన సదుపాయాలపై నివేదికలు తయారు చేయండి.
* కృష్ణా నది వరద ముంపు లేకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ బండ్ను మొక్కలు, విద్యుద్దీపాలతో తీర్చిదిద్దండి. విజయవాడలో అంబేడ్కర్ పార్కుకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దండి. తర్వాత విశాఖలో సుందరీకరణ పనులు చేపట్టాలి.
* జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పెద్ద కాలనీల నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ ప్రాధాన్యక్రమంలో నీరు, మురుగు కాల్వలు, విద్యుత్ సదుపాయాలు కల్పించాక మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
* జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కింద ప్రతి నియోజకవర్గంలో ఓ లేఅవుట్ను తీర్చిదిద్దాలి. దీనిపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్షించి, ప్రత్యేక దృష్టి సారించాలి.
* వైఎస్ఆర్ చేయూత కింద లబ్ధి పొందుతున్న మహిళలు, ఆ డబ్బుతో స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకోండి. వారికి స్వయం ఉపాధి మార్గ్గాలు చూపించి, సంపూర్ణ సాధికారతకు కృషి చేయండి.
ఫ్లెక్సీ తయారీదారులకు రుణాలిప్పించండి
ప్లాస్టిక్ ఫ్లెక్సీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినందున దీనిని సంపూర్ణంగా అమలు చేసేందుకు సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి. వాళ్లు ప్లాస్టిక్ నుంచి వస్త్ర బ్యానర్ల వైపు మళ్లేలా కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు తోడుగా నిలవండి. అవసరమైతే రుణాలు ఇప్పించండి. సకాలంలో తిరిగి చెల్లించే వారికి ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ కల్పించేలా అధికారులు ఆలోచన చేయండి’ అని అధికారులకు నిర్దేశించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు పొందినవారికి అభినందన
స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో 11 అవార్డులు గెల్చుకున్న తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్లు పులివెందుల, పుంగనూరు, పొదిలి, సాలూరు మున్సిపాల్టీల ఛైర్మన్లు, వైస్ఛైర్మన్లు కమిషనర్లు, ఇతర అధికారులను సీఎం అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.