నిధుల మళ్లింపుపై గర్జించిన సర్పంచులు
పార్టీలకు అతీతంగా సర్పంచులు కదం తొక్కారు. పోలీసుల ఆంక్షలను తప్పించుకొని రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో
కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నం
32 మంది అరెస్టు, విడుదల
ప్రజలకు మేలు చేయని పదవులు రద్దు చేయాలని వాగ్వాదం
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-తాడేపల్లి: పార్టీలకు అతీతంగా సర్పంచులు కదం తొక్కారు. పోలీసుల ఆంక్షలను తప్పించుకొని రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని గర్జించారు. నిధులు ఇవ్వాలని, లేదంటే సర్పంచి పదవులను రద్దుచేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని ఆగ్రహోదగ్రులయ్యారు. తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ముందు శుక్రవారం కనిపించిన వాతావరణమిది. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.948 కోట్లను విడుదల చేయాలన్న డిమాండుతో పలు జిల్లాల సర్పంచులు కమిషనర్ కార్యాలయం ముట్టడికి శుక్రవారం యత్నించారు. ఒకరోజు ముందే సర్పంచుల సంఘం పిలుపునివ్వడంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల సర్పంచులు కార్యక్రమానికి హాజరుకాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కమిషనర్ కార్యాలయానికి ఇతరులెవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. పలు జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న సర్పంచులు శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమ డిమాండ్లతో కూడిన నినాదాల ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు చుట్టుముట్టడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఈలోగా పంచాయతీరాజ్శాఖ ఉప కమిషనర్లు డి.సత్యనారాయణ, నాగార్జునసాగర్, గణాంకాధికారి వీరాంజనేయులు వచ్చి సర్పంచులతో మాట్లాడారు. సర్పంచులు మూకుమ్మడిగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమస్యలపై వినతిపత్రం ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని అధికారులు చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసేవరకూ కదిలేది లేదని సర్పంచులు పట్టుబట్టారు. పోలీసులు వారిని తరలించే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పలు వాహనాల్లో మంగళగిరి స్టేషన్కు తీసుకెళ్లి 32 మందిని అరెస్టుచేసి, తర్వాత విడుదల చేశారు. అనంతరం సర్పంచులంతా అక్కడే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అరెస్టయిన సర్పంచులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మంగళగిరిలో కలిసి పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించారు.
నిధులు కేటాయించకపోతే త్వరలో సీఎం ఇల్లు ముట్టడిస్తాం
‘15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇప్పటికైనా కేటాయించకపోతే త్వరలో సీఎం ఇల్లు ముట్టడిస్తాం. న్యాయమైన డిమాండ్ల సాధనకు అవసరమైతే పదవులకు రాజీనామా చేయడానికైనా వెనకాడేది లేదు. శాంతియుత వాతావరణంలో సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన సర్పంచులను అరెస్టు చేయడం అన్యాయం.’
- గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ పాపారావు
బోనులో నిలబెట్టాల్సింది ప్రభుత్వాన్నే
‘బోనులో నిలబెట్టాల్సింది.. కేంద్రం కేటాయించిన నిధులను తమ పంచాయతీలకు ఇవ్వాలని అడుగుతున్న సర్పంచులను కాదు, నిధులు దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వాన్నే. స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలను తీసుకొచ్చి సర్పంచులకు అధికారాలు లేకుండా చేసింది. విద్యుత్తు ఛార్జీలు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను ప్రభుత్వమే చెల్లించాలి. సర్పంచుల సమస్యలు పరిష్కరించకుండా వారిని అరెస్టు చేయడం అన్యాయం.’
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు
సర్పంచుల అరెస్టు దుర్మార్గం
‘చట్టబద్ధంగా రావలసిన నిధులను పంచాయతీలకు కేటాయించాలని శాంతియుత వాతావరణంలో ఆందోళన చేస్తున్న సర్పంచులను అరెస్టు చేయడం దుర్మార్గం. కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరాం. పంచాయతీల్లో నిధుల కొరతతో సర్పంచులు చిన్న చిన్న పనులూ చేయలేకపోతున్నారు. న్యాయంగా రావల్సిన నిధులను ఇప్పించాలని అడిగిన సర్పంచుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం’
- అఖిలభారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జె.వీరాంజనేయులు
మా పంచాయతీవి రూ.20 లక్షలు మళ్లించారు
ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీ విద్యుత్తు బకాయిల కింద చెల్లించామని చెప్పడంలో నిజం లేదు. మా పంచాయతీ విద్యుత్తు పంపిణీ సంస్థకు రూ.22.80 లక్షలు బకాయి ఉన్నట్లు చూపించి... ఆర్థిక సంఘం నిధులు రూ.20 లక్షలు మళ్లించారు. అలా చెల్లిస్తే ఇంకా రూ.2.80 లక్షలే బాకీ ఉండాలి. కానీ, రూ.34 లక్షలుగా చూపిస్తున్నారు. మరి ఆర్థిక సంఘం నిధులు ఎక్కడికి వెళ్లినట్లు?
- మనోహర్, వైకాపా సర్పంచి, బండారుపల్లి, గుంటూరు జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల ‘కిరణం’!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.