YSRCP: అధినేతను మించి.. అడ్డగోలుగా మాట మార్చి
మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అమరావతిపై మాట మార్చే విషయంలో ప్రభువును మించి స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. అమరావతిపై 2014 ఎన్నికలకు ముందు ఒకలా, రాజధానిగా ఎంపిక చేసినప్పుడు ఒకలా, ఎంపిక చేశాక మరోలా, 2019 ఎన్నికలకు ముందు ఇంకోలా, అధికారంలోకి వచ్చాక మరొకలా మాట మార్చేసిన జగన్ అండ్ కో.. ఇప్పుడు అసలు నైజాన్ని ప్రదర్శిస్తూ అమరావతిపై నిత్యం విషం చిమ్ముతోంది.
అమరావతిపై వైకాపా కీలక నేతలదీ అదే తీరు
ఇదే రాజధాని అన్ననోటనే ఇప్పుడు 3 రాజధానుల పాట
ఈనాడు - అమరావతి
మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అమరావతిపై మాట మార్చే విషయంలో ప్రభువును మించి స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. అమరావతిపై 2014 ఎన్నికలకు ముందు ఒకలా, రాజధానిగా ఎంపిక చేసినప్పుడు ఒకలా, ఎంపిక చేశాక మరోలా, 2019 ఎన్నికలకు ముందు ఇంకోలా, అధికారంలోకి వచ్చాక మరొకలా మాట మార్చేసిన జగన్ అండ్ కో.. ఇప్పుడు అసలు నైజాన్ని ప్రదర్శిస్తూ అమరావతిపై నిత్యం విషం చిమ్ముతోంది. రాజధాని అమరావతిలోనే ఉంటుందని, మార్చబోమని ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలతో నమ్మబలికిన జగన్ బృందం.. అధికారంలోకి వచ్చాక అది శ్మశానమని, ఎడారని అభాండాలు వేసింది. కృష్ణా నదికి వరదలొస్తే రాజధాని మునిగిపోతుందని, అక్కడి నేల నిర్మాణాలకే పనికిరాదని అసత్యాలు ప్రచారం చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఎసైన్డ్ భూములు అక్రమంగా కొన్నారని, భూసమీకరణ పేరుతో రైతుల మెడపై కత్తిపెట్టి.. భూములు తీసుకున్నారని పదే పదే విషప్రచారం చేసింది. అవన్నీ అవాస్తవాలని కోర్టుల్లోనూ, వివిధ వేదికల్లోనూ రుజువైనా.. అమరావతిపై విషం కక్కడం మానలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనుల్ని ఎక్కడివక్కడ నిలిపివేసింది. అక్కడితో ఆగకుండా పాలన వికేంద్రీకరణ ముసుగులో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చి అమరావతిని చంపేసే ప్రయత్నాల్లో భాగంగా వైకాపా నాయకులు.. అమరావతిపై ఎలా మాట మార్చేశారంటే..
బొత్సకు బోలెడన్ని నాలుకలు
మాటలు మారుస్తూ వచ్చారిలా!
అధికారంలోకి వచ్చాక..
కృష్ణా నదికి వరదొస్తే రాజధాని మునిగిపోతుంది
కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించి, దాని ఆధారంగా రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. చంద్రబాబు దాన్ని పట్టించుకోకుండా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. కృష్ణా నదికి 8 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే ఈ ప్రాంతమంతా మునిగిపోతోంది. 11 లక్షల క్యూసెక్కుల వరదొస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ ప్రాంతంలో వంద అడుగుల లోతు నుంచి పునాదులు వేయాలి. మిగతాచోట్ల రూ.లక్ష ఖర్చయ్యే పనికి ఇక్కడ రూ.2-3 లక్షలు వెచ్చించాలి. రాష్ట్రానికి ఇది ఆర్థిక భారం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని త్వరలోనే మా విధానాన్ని ప్రకటిస్తాం.
- 2019 ఆగస్టు 25న
భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారే రాజధాని మార్చాలంటారు
విభజన చట్టం ప్రకారం కొత్త ప్రభుత్వం నిర్ణయించిన చోటే రాజధాని అని స్పష్టంగా ఉంది. ఆ మేరకు గుంటూరు- విజయవాడ మధ్యే రాజధాని ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరుక్షణమే ప్రతిపక్ష నేతగా మా నాయకుడు ‘రాజధానిని ఇక్కడే పెట్టండి. మాకు అభ్యంతరమేమీ లేదు. మేం పూర్తిగా సమర్థిస్తున్నాం’ అని చెప్పారు. రాజధానిగా అమరావతికి మేం వ్యతిరేకం కాదు.. జగన్ అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు. ఎందుకు మారుస్తారు? ఎవరైతే భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారో వారికే రాజధాని మార్పు కావాలి. మాకు కాదు.
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు
ఈ శ్మశానం చూసి ఏడవటానికా?
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తగుదునమ్మా అంటూ రాజధాని చూడటానికి వస్తారట. ఎందుకు? ఈ శ్మశానం చూసి ఏడవటానికా? అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా శ్మశానంలా మార్చారు.
- 2019 నవంబరులో
నిపుణుల కమిటీ చెప్పాకే స్పష్టత
రాజధాని ఏ ఒక్క ప్రాంతానిదో, పార్టీదో, సామాజికవర్గానిదో కాదు. 5 కోట్ల మంది ప్రజలది. దానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ జిల్లాల్లో పర్యటిస్తోంది. వారు నివేదిక ఇచ్చిన తర్వాతే రాష్ట్ర రాజధానిపై స్పష్టత వస్తుంది. ఈ ప్రాంతంలోని రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. నిర్మాణ దశలో ఉన్న భవనాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
- 2019 నవంబరు 12, డిసెంబరు 14న
రాజధాని మార్చే ప్రతిపాదన లేదు
అమరావతి నుంచి రాష్ట్ర రాజధాని మార్చే ప్రతిపాదనేదీ లేదు. అందుకే రాజధాని మార్పు వల్ల రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.
- 2019 డిసెంబరు 13న శాసనమండలిలో
నెలలో పనులు పునఃప్రారంభిస్తాం
సీఆర్డీఏ చట్టం, భూసమీకరణ ఒప్పందం ప్రకారం రైతులకు ఉన్న హక్కులు, వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు లేఅవుట్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేసి ఇస్తాం. అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు అభివృద్ధి చేస్తాం. రైతులకు ఇంకేమైనా సమస్యలున్నా చెబితే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా.
- 2020 జనవరి 8, 11 తేదీల్లో..
విశాఖ వచ్చి రాజధాని వద్దనండి చూద్దాం
గత ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేసినప్పుడు, సీఆర్డీఏ చట్టం చేసినప్పుడు ఇతర ప్రాంతాలను పట్టించుకోలేదు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చెందాలి.అందుకే సీఆర్డీఏ చట్టం రద్దుకు ప్రతిపాదిస్తున్నాం. విశాఖపట్నం వచ్చి అక్కడ రాజధాని వద్దని, కర్నూలు వెళ్లి మీకు హైకోర్టు వద్దని చెప్పండి చూద్దాం
- 2020 జనవరి 20న సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చలో
రాజధాని నుంచే పాలించాలని ఉందా?
అమరావతి రైతులకు పరిహారం ఇస్తున్నాం. ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పాం. వారి మనసులో ఉన్నట్లు ప్రభుత్వం చేయాలంటే కుదరదు. రాజధాని ప్రాంతం నుంచే సీఎం పాలించాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం. విశాఖకు రాజధాని వెళ్లకపోవటం అంటూ ఉండదు. న్యాయస్థానాల్ని ఒప్పిస్తాం. అమరావతి నిర్మాణానికి అయిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు మట్టిలో పోయాలి. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తే మీకొచ్చే నష్టమేంటి?
ఏ క్షణంలోనైనా మార్చేస్తాం
మా ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. కార్యనిర్వాహక రాజధాని ఏ క్షణాన్నైనా విశాఖకు మారుతుంది. అమరావతి రైతులు చేస్తోంది పాదయాత్రా కాదు, దండయాత్రా కాదు. యాత్ర చేస్తోంది రైతులు కాదు. అది స్థిరాస్తి వ్యాపారులు వారి సంపాదన కోసం చేస్తున్న యాత్ర. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని వద్దంటూ అక్కడికే పాదయాత్రగా వస్తుంటే ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? పాదయాత్రను అడ్డుకోవడం ఐదు నిమిషాల పని. రాజధాని రైతులు ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఒప్పందంతో భూములిచ్చారు. రాజధాని కోసం భూసమీకరణలో భూములివ్వడం త్యాగం ఎలా అవుతుంది? వాళ్లలో బినామీలు, దళారులు ఉన్నారు. రాజధాని అమరావతిలోనే కట్టాలని ఆ ఒప్పందంలో ఎక్కడా లేదు.
- ఈ ఏడాది సెప్టెంబరు 25న మూడు రాజధానులపై విశాఖ రౌండ్ టేబుల్ సమావేశంలోనూ, అక్టోబర్ 6న మీడియాతోనూ..
అంతా అ‘ధర్మానే’..!
రాజధాని అమరావతిపై మాట మార్చడంలో సహచర వైకాపా నాయకులందర్నీ మించిపోయారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాజధానిని అమరావతి నుంచి మార్చే ఆలోచనే తమ పార్టీకి లేదని ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పిన ఆయన.. ఇప్పుడు అమరావతిపై విషం కక్కని రోజు ఉండటం లేదు.
అమరావతే రాజధాని.. మార్చే ప్రసక్తి లేదు
రాజధాని ఇంకో ప్రాంతంలో నిర్మించాలన్న ఆలోచన వైకాపాకు లేదని తేటతెల్లమైంది. ఎవరూ అలాంటి విషయాలు మళ్లీ వైకాపాకు ఆపాదించే ప్రయత్నం చేయొద్దని కోరుతున్నాను. రాజధాని ఇంకో ప్రాంతంలో పెట్టండని రాష్ట్రంలో అడిగేవారు ఎవరైనా ఉంటే.. ఆ అంశానికి ఇక చోటు లేదు. ఎందుకంటే నిర్ణయం అయిపోయింది. ప్రభుత్వం చెప్పిన ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం జరుగుతోంది కనుక ఇతర ప్రాంతాల గురించి ఎవరైనా మాట్లాడినా అది అప్రాధాన్య అంశమే.
- ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలివీ..
రాజధానిని ఎందుకు అడ్డుకుంటామండీ?
రాజధానిని ఇతర పార్టీలన్నీ అడ్డుకుంటున్నాయని చెబుతున్నారు. ఎందుకు అడ్డుకుంటాయండీ? మీ ఒక్కరి కాలంలో అయ్యే పనేనా ఇది? 50 సంవత్సరాలు కొనసాగించాల్సింది. పది టర్మ్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చి కొనసాగించాల్సిన కార్యక్రమం ఇది.
- వైకాపా అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందంటూ అప్పట్లో ధర్మాన మాటలు
గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నాం
గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నాం. రాజధానిని వైకాపా అడ్డుకుంటుందనడం అవాస్తవం.
- 2014 నవంబరు 13న నిడమర్రులో..
అదే ధర్మాన రాజధాని రైతుల పాదయాత్రను ఉద్దేశించి ఏమంటున్నారంటే..
విశాఖలో రాజధానికి అడ్డొచ్చినవారిని చితక్కొట్టేయండి!
విశాఖకు కార్యనిర్వాహక రాజధాని వచ్చి తీరుతుంది. అమరావతిలో లింగులింగుమని 8 గ్రామాల వారున్నారు. వారేదో గొప్ప పోరాటం చేస్తున్నారంటూ రోజూ పత్రికల్లో వార్తలు. అభివృద్ధిని నాలుగు ప్రాంతాలకూ విస్తరిస్తామంటే ఎందుకు ఉద్యమిస్తున్నారు? అమరావతి రైతుల ఉద్యమం బోగస్. మన పీక కోయడానికి మన ఊరికి, మన అరసవల్లికి వస్తారట. వాళ్లకు ఇక్కడున్న తెదేపా వాళ్లు హారతులు పడతారట. రాజకీయంగా ఎవర్ని ఆహ్వానించాలో, ఎవర్ని తిరస్కరించాలో మీరంతా ఆలోచించండి. విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దానికి మీరేమీ చందాలివ్వక్కర్లేదు. త్యాగాలు చేయక్కర్లేదు. విశాఖే రాజధానని ఏకకంఠంతో మాట్లాడితే చాలు. రాజధాని విశాఖలో ఏర్పాటవుతుందంటే అడ్డొచ్చిన వారందరినీ రాజకీయంగా చితక్కొట్టేయాలని మనవి చేస్తున్నాను.
- అక్టోబర్ 7న శ్రీకాకుళం జిల్లా గార సమీపంలో ప్రజల్ని ఉద్దేశించి ధర్మాన
అమరావతి నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు
తమ్మినేని సీతారామ్
(నాటి వైకాపా నేత, ప్రస్తుత శాసనసభ సభాపతి)
నాడు: తెదేపా ప్రభుత్వానికి బుర్రా, బుద్ధీ ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మా పార్టీ గంపగుత్తగా మద్దతిచ్చింది. రాజధానిని కట్టుకోవచ్చని చెప్పింది. కట్టొద్దని గానీ, మేం వస్తే రాజధానిని కట్టబోమని గానీ చెప్పలేదే?
రాజస్థాన్ ఎడారిలో బయల్దేరినట్లు ఉంది
నేడు: రాజధానిని ప్రతివారూ ఇది మా రాజధాని అనుకోవాలి. పదిహేనేళ్ల విరామం తర్వాత నేను మళ్లీ ఎమ్మెల్యే అయ్యాను. తొలిసారి కరకట్ట మీద నుంచి రాజధానికి బయల్దేరితే.. వెళుతూనే ఉన్నాను గానీ, ఎంతకీ రాజధాని రావడం లేదు. నాతో ఉన్న వ్యక్తిని రాజధాని ఇంకా ఎక్కడయ్యా? అని అడిగా. రాజస్థాన్ ఎడారిలో బయల్దేరినట్లు ఉంది. మూడు రాజధానులను ఇప్పుడు అందరూ స్వాగతిస్తున్నారు.
జగన్ సీఎం అయినా రాజధాని అమరావతిలోనే
అవంతి శ్రీనివాసరావు
(మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే)
నాడు: జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచి రాజధాని మార్చేస్తారని తెదేపా నాయకులు లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినా రాజధాని అమరావతిలోనే ఉంటుంది.
అమరావతి నుంచి రాజధాని మార్చకపోతే ఉత్తరాంధ్రలో విప్లవం
నేడు: అమరావతి నుంచి రాజధాని మార్చకపోతే ఉత్తరాంధ్రలో విప్లవం వస్తుంది. రాష్ట్రమంటే అమరావతిలోని 29 గ్రామాల ప్రజలే అన్నట్లు చంద్రబాబు అండ్ కో ప్రవర్తిస్తోంది.
అమరావతికి కట్టుబడి ఉన్నాం
- వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
నాడు: రాజధానిగా అమరావతికి, దాని అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. గత అయిదేళ్లలో రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1,700 కోట్లు కాకుండా, గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం రూ.212 కోట్లే.
మూడు రాజధానులతోనే అభివృద్ధి
నేడు: అమరావతి రైతుల పాదయాత్ర ఓ దొంగయాత్ర. దాన్ని ఎలా తిప్పికొట్టాలో, ఎలా తరిమికొట్టాలో మాకు తెలుసు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాల్సిందే. వికేంద్రీకరణ కోసం రాజీనామాకైనా సిద్ధమే.
- ఈ ఏడాది అక్టోబర్ 8న
ఇతర ప్రాంతాల నాయకులదీ అదే తీరు..
రాజధాని అమరావతిపై అప్పుడో తీరుగా, ఇప్పుడో తీరుగా మాట్లాడటం ఒక్క ఉత్తరాంధ్ర నాయకులకే పరిమితం కాలేదు. రాజధాని చుట్టూ ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా నేతలతోపాటు రాయలసీమలోని ఆ పార్టీ ముఖ్యులు కూడా ఎలా మాట మార్చారంటే..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి
రాజధానిని తరలించం
- 2018 డిసెంబరు 16న కృష్ణా జిల్లా నందిగామలో ..
వైకాపా అధికారంలోకి వస్తే రాజధానిని మరో ప్రాంతానికి తరలించం. అక్కడే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం.
మూడు రాజధానులు ఖాయం
అది రైతు ఉద్యమం కాదు. అమరావతిలో భూములు కొన్నవాళ్లు వాటిని పరిరక్షించుకోవడానికి నడుపుతున్న ఉద్యమం. భూముల్ని రక్షించుకోవడానికి, పడిపోయిన ధరలు పెంచుకోవడానికి ఒకే రాజధాని అంటున్నారు. న్యాయస్థానానికి కూడా వాళ్లే డైరెక్షన్ ఇస్తున్నారు. దేవుడేమైనా పాదయాత్ర చేయమని చెప్పాడా? రాష్ట్రంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని జగన్ తీవ్రంగా ఆలోచించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను చేయడం ఖాయం.
- న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతుల పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభపై స్పందిస్తూ..
రాజధానిని ఎవరు తరలిస్తున్నారు?
జోగి రమేష్, మంత్రి
నాడు: రాజధానిని అమరావతి నుంచి తరలించేస్తారని చంద్రబాబు, సుజనా చౌదరి లాంటి వ్యక్తులు కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. రాజధానిని ఎవరు తరలిస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు?
అది పాదయాత్ర కాదు..
నేడు: అది అమరావతి రైతుల పాదయాత్ర కాదు. తెలుగుదేశం పార్టీ శవయాత్ర.
రాజధానిని మార్చేస్తారనేది అపోహే
ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైకాపా ఎమ్మెల్యే)
నాడు: వైకాపా అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. రాజధాని అమరావతిలో ఉంది కాబట్టే జగన్ ఇక్కడేఇల్లు కట్టుకున్నారు. జగనన్నను నేను కోరతా.ఎప్పటికీ అమరావతే రాజధానిగా ఉంటుంది.
- 2019 ఏప్రిల్ 9న
వికేంద్రీకరణను స్వాగతిస్తున్నా
నేడు: రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా వికేంద్రీకరణను స్వాగతిస్తున్నా. తుళ్లూరులో రాజధాని వద్దని ఆనాడే చెప్పా.
ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధాని
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వైకాపా మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్)
నాడు: ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధాని. అది ఇక్కడే ఉంటుంది. దీన్ని మంచి నగరం స్థాయికి తీసుకొస్తాం. అన్ని వసతులు ఉండేలా చూస్తాం. ఈ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరుస్తాం. రాజధాని అమరావతిలోనే ఉంటుంది. లేనిపోని ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు.
- 2019 ఫిబ్రవరి 26న
అభివృద్ధిని కేంద్రీకృతం చేద్దామనేది సరికాదు
నేడు: అమరావతి కోసం మిగతా ప్రాంతాలు, జిల్లాలేవీ అభివృద్ధి కాకుండా ఇక్కడే కేంద్రీకృతం చేద్దామనేది సరికాదు. కొన్నిసార్లు పొరపాట్లు సరిదిద్దుకుంటాం.
రాజధాని తరలిస్తారంటూ నీతిమాలిన రాజకీయం
ఆర్కే రోజా, మంత్రి
నాడు: అమరావతి నుంచి రాజధాని తరలిస్తారని, రాజధానికి జగన్ వ్యతిరేకమంటూ చంద్రబాబు నీతిమాలిన రాజకీయం చేస్తున్నారు. అందుకు చెంపపెట్టుగా జగన్ అమరావతిలో గృహప్రవేశం చేశారు. రాజధాని కట్టగలిగే సమర్థుడు జగనే. సామాన్యులు, పేదలకు ఉపయోగపడే రాజధాని కట్టాలనేది ఆయన ఉద్దేశం.
ఉత్తరాంధ్ర, రాయలసీమ పన్నులతో 29 గ్రామాలే సంతోషంగా ఉండాలా?
- తిరుపతిలో రాజధాని రైతుల సభపై స్పందిస్తూ..
నేడు: ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు పన్నులు కడుతుంటే అమరావతిలోని 29 గ్రామాలే సంతోషంగా ఉండాలని ఆ ప్రాంత నాయకులు మాట్లాడుతున్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్న వారంతా ఉద్యమం ముసుగులో ఒక్కటయ్యారు.
రాజధాని అమరావతిలోనే ఉంది.. ఉంటుంది
కురసాల కన్నబాబు (మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే)
నాడు: అమరావతిలోనే రాజధాని ఉంది. ఉంటుంది. ఇక్కడి నుంచే రాజకీయాలు చేయాలి కాబట్టే జగన్ ఇల్లు, పార్టీ కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు.
సచివాలయానికి నాయకులు, పైరవీకారులు వస్తారు
నేడు: హైదరాబాద్ మాదిరిగా ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయమంటారా? అమరావతి కొందరికే రాజధానిగా ఉంది. వారు చేస్తున్న కృత్రిమ ఉద్యమాల గురించి అందరికీ తెలుసు. అయినా సచివాలయానికి అందరూ రారు. నాయకులు, పైరవీకారులే వస్తుంటారు. సామాన్యులైతే సీఎం సహాయనిధి కోసం వస్తారు. ఇప్పుడు వాళ్లు కూడా రావాల్సిన అవసరం లేకుండా జోనల్ వ్యవస్థ తెస్తున్నాం.
జగన్ నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా వెలుగుతుంది
పేర్ని నాని (మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే)
నాడు: అమరావతి గడ్డపై జగన్ నాయకత్వంలో రాజధానిగా అమరావతి దేదీప్యమానంగా వెలుగొందుతుంది.
మట్టి, నీళ్లకు మించి అక్కడ ఏముంది?
నేడు: దేశమంతా తిరిగి చెంబు మట్టి, గ్లాసు నీళ్లు తెచ్చి అమరావతిలో పోగేశారు. అంతకు మించి అక్కడ ఏముంది? ఒక షెడ్డు వేసి మట్టి తెచ్చి షో చేశారు.
రాజధానిలో ఉండాలనే అమరావతిలో జగన్ ఇల్లు కట్టుకున్నారు
వెలంపల్లి శ్రీనివాస్ వైకాపా ఎమ్మెల్యే
నాడు: జగన్ మాటలు చెప్పరు. అందుకే రాజధాని అమరావతిలో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకున్నారు. మూడు రాజధానులనేవి ఆలోచన మాత్రమే. అమరావతిని ఎవరూ తరలించట్లేదే?
చంద్రబాబు, బినామీలే కావాలంటున్నారు..
నేడు: చంద్రబాబు, ఆయన బినామీలే అమరావతిని అభివృద్ధి చేయాలని మాట్లాడుతున్నారు. 13 జిల్లాలనూ అభివృద్ధి చేస్తామంటే వద్దంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు