Pawan Kalyan: నేరస్థుల పాలన నుంచి విముక్తే లక్ష్యం
‘మనం నేరస్థుల పాలనలో ఉండకూడదు. నేర రాజకీయాలు చేసే వారు పాలకులుగా, విధాన నిర్ణేతలుగా మారిపోతే వారికి చట్టాలు వర్తించవు. వారు దాడులు చేసెయొచ్చు. రాజకీయాల నుంచి నేరగాళ్లను దూరం చేయాలనేది మొదటి నుంచి నా ఆలోచన.
అందరూ సహకరించాలి
వైకాపాపై పోరుకు దిల్లీ భాజపా నేతల సాయం కోరను
అమ్మా, పప్పా అంటూ మోదీ, అమిత్షాల వద్దకు వెళ్లను
ఇది మా రాష్ట్రం..మేమే తేల్చుకుంటాం
జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఈనాడు- అమరావతి, విశాఖపట్నం: ‘మనం నేరస్థుల పాలనలో ఉండకూడదు. నేర రాజకీయాలు చేసే వారు పాలకులుగా, విధాన నిర్ణేతలుగా మారిపోతే వారికి చట్టాలు వర్తించవు. వారు దాడులు చేసెయొచ్చు. రాజకీయాల నుంచి నేరగాళ్లను దూరం చేయాలనేది మొదటి నుంచి నా ఆలోచన. నేర స్వభావంతో ఉన్న ఈ రాజకీయ నాయకుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురాకపోతే భావితరాలకు నష్టం జరుగుతుంది. రాష్ట్రం బాగుపడాలంటే వైకాపా నుంచి విముక్తి కల్పించాలి. వచ్చే ఎన్నికల్లో బలంగా పని చేసి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ను సాధిస్తాం’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రకటించారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.
విశాఖపట్నం నుంచి నేరుగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వచ్చిన పవన్ సోమవారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడారు. విశాఖలో ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులపై దిల్లీకి ఫిర్యాదు చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా ‘మీరు బీజేపీకి చెప్పొచ్చుగా అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. బీజేపీ అగ్రనాయకులు.. ఇక్కడ యుద్ధం మీరే చెయ్యండని చెబుతారు. వ్యక్తిగతంగా నేనో పార్టీ అధిపతిని. ప్రతిదానికి అమ్మా, పప్పా అంటూ మోదీని, అమిత్షాను అడగలేను కదా. ఇది మన సమాజం.. మన నేల.. మన ఆంధ్రప్రదేశ్.. దాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. వైకాపా నాయకులకు చెబుతున్నా. నాకు ధైర్యం ఉంది. దిల్లీ వెళ్లం. ఇక్కడే తేల్చుకుంటాం’ అని సమాధానమిచ్చారు.
ప్రతిదానికీ కులాలు, ప్రాంతీయ భేదాలేనా?
‘ప్రజలు మీకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. పరిపాలించండి అంటే గొడవలు పెడతారేంటి? సంఘ విద్రోహ శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఎదుర్కోవాలి. అలాంటిది రాష్ట్రంలో ప్రభుత్వమే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోంది. ప్రతిదానికీ కులమేనా? అవి చాలవని మళ్లీ ప్రాంతీయ విభేదాలా? నిస్సహాయులు, దెబ్బతిన్నవారు గర్జిస్తారు. వైకాపాకు హింసే కావాలంటే అది మేం చేయం. కోనసీమలో వాళ్ల మంత్రి ఇల్లు తగలబెట్టించి మా వాళ్లపై నెపం నెట్టినా ఎదుర్కొన్నాం. ఇప్పుడు విశాఖలో ఇలా చేశారు. విమానాశ్రయ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న 14 మంది నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టారు. మరో వంద మందికి పైగా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఈ రోజు మళ్లీ 54 మందిపై కేసులు నమోదు చేశారు. వైకాపా నాయకులకు అనుకూలంగా ఉండే ఒక సబ్జైలర్ మా జనసేన నాయకుణ్ని బెల్టుతో కొట్టి, బూతులు తిట్టారట. పోలీసులు అదుపులో ఉండగా మా కార్యకర్తలను అసభ్యంగా తిట్టారట. పోలీసులు విశాఖలో నన్నూ ఎంతో ఇబ్బంది పెట్టారు. కోట్ల మంది అభిమానులున్న నన్నే ఇంత ఇబ్బంది పెడితే ఇక సామాన్యుల పరిస్థితేంటి? మొన్న నా కారెక్కి నన్ను నియంత్రించబోయిన పోలీసు అధికారిని.. మీరు ఐపీఎస్ చదువుకున్నారు, ప్రాథమిక హక్కులు కాపాడటం ఇలాగేనా? మేం చేసిన తప్పేంటి అని అడిగితే ఆయన మౌనం దాల్చారు. విశాఖలో వైకాపా గర్జన కార్యక్రమం నిర్ణయించాక మేం కార్యక్రమం పెట్టామనడం సరికాదు. జనవాణి కార్యక్రమం ఎప్పుడో ఖరారైంది. ఆ తర్వాత మూడు రోజులకు వైకాపా విశాఖ గర్జన ప్రకటించింది. వారి కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఆలోచన మాకు లేదు. మా పార్టీ సమావేశాలు మా అంతర్గత వ్యవహారం. వారికి ముందే ఎందుకుచెబుతాం?’ అని పవన్ అన్నారు.
నోవోటెల్లో పోలీసులు ఎవరినీ నిద్రపోనివ్వలేదు
‘విశాఖ నోవోటెల్ హోటల్లో ఉన్న అతిథులందర్నీ పోలీసులు ఇబ్బందులు పెట్టారు. గదుల్లోకి వెళ్లి తనిఖీలు చేశారు. దుప్పటి కప్పి పిల్లల్ని పడుకోబెడితే అవి కూడా తీయించి వెతికారు. మంచం కింద వెతికారు. రాత్రంతా ఎవరూ నిద్రపోకుండా చేశారు’ అని పవన్ ప్రశ్నించారు.
న్యాయవ్యవస్థకు ధన్యావాదాలు
విశాఖలో జనసేన నాయకులపై పెట్టిన హత్యాయత్నం సెక్షన్లు సరికాదని న్యాయస్థానం చెప్పింది. అక్కడ చేరిన జనాలు నినాదాలతో నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించింది. న్యాయాన్ని రక్షిస్తున్న న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను న్యాయవ్యవస్థ ప్రత్యేకంగా గమనిస్తూ ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నా’ అని పవన్కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కె.నాగబాబు పాల్గొన్నారు.
కేసులకు భయపడొడ్డు... ధైర్యంగా ఎదుర్కొందాం: పవన్
విశాఖ విమానాశ్రయ సంఘటనల కేసుల్లో అరెస్టయిన జనసేన నాయకులు, శ్రేణులపై పోలీసులు ఇష్టానుసారంగా చేయిచేసుకున్నారని, రాజ్యాంగ నిబంధనలను పూర్తిగా అతిక్రమించారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఈ ఘటనల్లో అరెస్టయి సోమవారం తెల్లవారుజామున బెయిల్పై విడుదలైన వారితో ఆయన విశాఖలో తాను బస చేసిన హోటల్లో భేటీ అయ్యారు. ‘కేసులకు వెరవకుండా.. ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం. ఏం జరిగినా యుద్ధంలో సైనికుల మాదిరిగా పోరాడదాం. జనసేన నాయకులపై చేయిచేసుకున్న పోలీసుల పేర్లతో సమగ్ర నివేదిక సిద్ధం చేయండి. బాధితులకు పార్టీ న్యాయ విభాగం పూర్తి అండగా ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ఇటీవలే జనసేన పార్టీలో చేరిన రూప అనే వీరమహిళ చంటి పిల్లలతో ఉన్నానని, ఆరోగ్యం బాగోలేదని చెప్పినా, అర్ధరాత్రి ఇంటికెళ్లి మరీ అరెస్టు చేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఇంకా జైల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ పట్ల కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని.. ఆయన్ను గెడ్డం, మీసాలు తీసేయాలని కారాగార సిబ్బంది బలవంతం చేశారని ఆరోపించారు. పోలీసు కస్టడీలో ఉన్న ఇతర నాయకులను కూడా పోలీసులు కావాలని ఇబ్బంది పెట్టారన్నారు. మొత్తం 115 మందికి పైగా నాయకులు, శ్రేణులపై హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. జనసేన న్యాయవిభాగం ఇందులో 9 మంది తప్ప మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ తీసుకురాగలిగిందన్నారు. జైలుకు తరలించిన 9 మందికి కూడా బెయిల్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తాము పోరాడుతున్నది ప్రభుత్వంపైనే తప్ప పోలీసులపై కాదని గుర్తుంచుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్