Uddanam: ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు?
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 35,000 మంది కిడ్నీ రోగులు ఉన్నారు. ఇప్పటికే 4,500 మంది మరణించారు. సీరం క్రియాటిన్ స్థాయి 1.4 దాటిందంటే మందులు వేసుకోవాల్సిందే.
కిడ్నీ సమస్యలతో ఉద్దానంలో 35,000 మంది విలవిల
డయాలసిస్ బాధితులకే పింఛన్లు
రోగులకు నిర్ధారణ పరీక్షలు, మందులూ కరవే
కొన్ని మంచినీటి శుద్ధి ప్లాంట్ల మూసివేత!
నాటి మాటలు..
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 35,000 మంది కిడ్నీ రోగులు ఉన్నారు. ఇప్పటికే 4,500 మంది మరణించారు. సీరం క్రియాటిన్ స్థాయి 1.4 దాటిందంటే మందులు వేసుకోవాల్సిందే. నెలకు రూ.4-8 వేల వరకూ ఖర్చవుతుంది. అలాంటి వారందరికీ నెలకు రూ. 10,000 చొప్పున పింఛను అందిస్తాం. డయాలసిస్కు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా చేస్తాం. కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పీహెచ్సీల్లోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెస్తాం!
- ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో భాగంగా 2017 మే 20న శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జగతి గ్రామంలో కిడ్నీ రోగులకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ
నేటి పరిస్థితి..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బాధితులకు కిడ్నీ పరీక్షలు జరగడంలేదు. మందులు ఇవ్వడంలేదు. నెఫ్రాలజిస్టులు రావడంలేదు. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి రూ. 10,000, సీరం క్రియాటిన్ 5 పాయింట్లు దాటి, కిడ్నీ సైజు 8 సెం.మీ కంటే తక్కువ (స్టేజ్- 3, 4) ఉన్నవారికి నెలకు రూ. 5,000 చొప్పున పింఛన్ ఇస్తున్నా.. వారి సంఖ్య వెయ్యి లోపే. ఈ పింఛన్ పొందాలంటే శ్రీకాకుళం బోధనాసుపత్రికి వెళ్లి రెండు దశల్లో పరీక్షలు చేయించుకోవాలి. మొత్తం రోగుల సంఖ్య 50,000 పైచిలుకు ఉంది. వీరిలో మందులు వాడే వారు సగానికి పైగా ఉన్నా పింఛను రావడంలేదు. గ్రామాల్లో ఎక్కడా డయాలసిస్కు ఏర్పాట్లు జరగలేదు.
ఈనాడు-అమరావతి-ఈనాడు డిజిటల్-శ్రీకాకుళం, సోంపేట, న్యూస్టుడే: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధులు కబళించాయి. ఏడు మండలాల్లోని వేలమందిని దెబ్బతిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారమే 1,118 మంది మృత్యువాతపడ్డారు. అనధికారిక మరణాలులెన్నో! అత్యంత దుర్లభమైన పరిస్థితుల్లో ఉన్న ఉద్దానం కిడ్నీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సాంత్వన లభించడంలేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలూ సక్రమంగా జరగడంలేదు. మందులు అందడంలేదు. అవసరాలకు తగ్గట్లు నెఫ్రాలజిస్టులు లేరు. 19 పీహెచ్సీ, సీహెచ్సీల పరిధిలోని 23 ఎనలైజర్లలో 6 మాత్రమే పనిచేస్తున్నాయి. డ[యాలసిస్కి రోగులు ఎక్కువ దూరం వెళ్లనవసరం లేకుండా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోనే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేస్తామని సీఎం జగన్ ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. ఉమ్మడి జిల్లాలో ఏడు డయాలసిస్ కేంద్రాలుండగా అందులో ఆరింటిని గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటుచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 2020లో మందస మండలం హరిపురంలో మాత్రమే ఒకటి పెట్టారు.
వేలల్లో రోగులు.. 787 మందికే పింఛను
ప్రభుత్వపరంగా 114 హైరిస్క్ గ్రామాల్లో 19,502 మంది కిడ్నీ రోగులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రాథమిక స్థాయిలో మందులు వినియోగించే ప్రతి బాధితుడికి రూ. 10,000 పింఛన్ ఇస్తామన్నారు. కానీ.. డయాలసిస్ చేసుకునేవారికే రూ.10,000 ఇస్తున్నారు. ఆ పింఛన్ పొందాలన్నా శ్రీకాకుళం వెళ్లాల్సిందే. చాలామంది దూర ప్రాంతాల నుంచి తిరగలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. మందులు వాడే రోగులకు పింఛను, మందులు అందడం లేదు. ప్రస్తుతానికి 787 మందికే పింఛను అందుతోంది.
ఇంజక్షన్లు బయట కొనుక్కోవలసిందే
‘వారానికి రెండు, మూడుసార్లు ఎరిత్రోపాయిటిన్ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉండగా సక్రమంగా ఇవ్వడం లేదని సోంపేట మండలం జింఖీభద్ర గ్రామానికి చెందిన డయాలసిస్ రోగి రాయల నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ఇంజక్షన్ బయట కొనుక్కోవాల్సి వస్తోందని, మందులు, ఇతర పరీక్షలకు అంతా కలిపి రూ. 12,000 వరకూ ఖర్చవుతోందని పేర్కొన్నారు.
మందులు ఎక్కడ?
2017 నుంచి సామాజిక ఆసుపత్రుల పరిధిలో 23 రకాల మందులను ఉచితంగా ఇచ్చేవారు. వీటి కోసం అదనపు బడ్జెట్ కేటాయించేవారు. రెండేళ్లుగా ఈ బడ్జెట్ నిలిపేశారు. ఐరన్, కాల్షియం మాత్రలనే కిడ్నీ రోగులకు అందిస్తున్నారు. గతంలో నెఫ్రాలజిస్టులు వారానికి ఒకసారైనా ఒక సీహెచ్సీలకు వచ్చేవారు. ఇప్పుడు నెలల తరబడి రావడంలేదు.
ఖర్చు భారంగా ఉంది..
పలాస మండలం గొల్లమాకినపల్లికి చెందిన రాపాక చిన్న అప్పలస్వామి, అతని భార్య ఇద్దరూ వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇందుకోసం మందస మండలం హరిపురం వెళ్లాల్సి వస్తోంది. రవాణా ఖర్చులే నెలకు రూ.6,000 అవుతున్నాయి. మందులకు ఇద్దరికీ నెలకు రూ.15-20 వేలు ఖర్చవుతున్నాయని చెబుతున్నారు. ఇద్దరికీ పింఛను వస్తున్నా రవాణా, మందులు, ఇంజక్షన్ల ఖర్చుకు సరిపోవడం లేదన్నారు.
పరిశోధనకు నిధులేవీ!
కిడ్నీ వ్యాధిపై పరిశోధనలకు 2017లో అప్పటి ప్రభుత్వం ‘జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వారు సర్వే చేసి 2,419 మందిని గుర్తించారు. ఏడాది విరామంతో వరుసగా మూడుసార్లు పరీక్షలు (బేస్లైన్, మిడ్లైన్, ఎడింగ్ లైన్) చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు బేస్లైన్, మిడ్లైన్ పరీక్షలు జరిగాయి. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మిడిల్ లైన్ పరీక్షల నాటికి రూ. 5.73 కోట్లు చెల్లించాలి. రూ. 1.30 కోట్ల వరకే ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. ఆ సంస్థ పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదు. గుర్తించిన 2,419 మందిలో 133 మంది మరణించారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ నుంచి అందుతున్న ప్రత్యేక ఫండ్తో పరిశోధన మందకొడిగా సాగుతోంది.
సుజల పంపిణీ ఏదీ?
కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో శుద్ధజల కేంద్రాల ద్వారా తాగునీరు అందించేందుకు 2018లో గత ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకం అమలుచేసింది. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో ఏడు మండలాల్లో 167 మినీ శుద్ధజల కేంద్రాలు నిర్మించి తాగునీరు సరఫరా చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక వివిధ కారణాలతో 35% ప్లాంట్లు మూతపడ్డాయి.
పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్లే ఆధారం
వ్యాధి తీవ్రత గుర్తించేందుకు 2017లో 29 ప్రభుత్వాసుపత్రులకు రక్తపరీక్ష యంత్రాలు పంపారు. గతంలో గ్రామస్థాయిలో పరీక్షలు చేసేవారు. ఉద్దానం సామాజిక ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చేవారు. 2020లో కొవిడ్ ఆరంభం నుంచి ఈ ప్రాజెక్టు నిర్వహణ మందగించింది. ముఖ్యమైన మందుల సరఫరా ఆపేశారు. రక్త పరీక్ష యంత్రాలను ఇతర ప్రాంతాలకు తరలించడం, పాడైనవాటిని బాగుచేయక రక్త పరీక్షలు దాదాపుగా నిలిచిపోయాయి. రోగులు ప్రైవేటు ల్యాబ్లపై ఆధారపడాల్సి వస్తోంది. వారికి గతంలో ఎరిత్రోపాయిటిన్ ఇంజక్షన్ ఇచ్చేవారు. వాటి ఖరీదు దాదాపు రూ. 750. ఇప్పుడు ఇవ్వడంలేదు.
మూడేళ్లయినా పూర్తికాని పనులు
పలాసలో రూ. 50 కోట్ల అంచనాతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రానికి 2019 సెప్టెంబరు 6న సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 36.88 కోట్లతో చేపట్టిన భవన నిర్మాణాల్లో 70 శాతమే పూర్తయ్యాయి. రక్షిత తాగునీరు అందించేందుకు రూ. 700 కోట్ల అంచనాతో మెగా తాగునీటి పథకం పనులు 2020 ఆగస్టులో ప్రారంభమయ్యాయి. 807 గ్రామాలకు చెందిన 5.57 లక్షలమంది ప్రజలకు ఈ నీటిని అందించాలనేది ప్రాజెక్టు లక్ష్యం. అవి కూడా ఇంకా పూర్తి కాలేదు.
రూ.57 లక్షలతో కొత్త ఎనలైజర్లు, మందులు
పాత ఎనలైజర్లు పనిచేయకపోవడంతో కొత్తవి కొంటున్నాం. వాటితో పాటు డయాలసిస్ యంత్రాలు, మందుల కోసం అత్యవసరంగా రూ.57 లక్షలకు ప్రతిపాదనలు వచ్చాయి. నెల రోజుల్లో వీటిని అందుబాటులో తెస్తాం.
-శ్రీకేశ్ బి లఠ్కర్, శ్రీకాకుళం కలెక్టర్
‘భరోసా’ లేదు!
జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చినట్లుగా మందులు ఇవ్వడం లేదు. పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా మందులకే రూ. 10 వేలు అవుతుండటంతో అప్పులు చేస్తున్నా. మరోవైపు ఫిట్స్, గుండెవ్యాధుల బారినపడ్డా. పింఛను రావడంలేదు.
-కవిటి మండలం జగతిలో జగన్మోహన్రెడ్డి నిర్వహించిన కిడ్నీ వ్యాధిగ్రస్థుల భరోసా సభలో ఆయనతో మాట్లాడిన బాధితుడి ఆవేదన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు