Andhra News: మహిళలపై మట్టిపోసి హత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో తమ కుటుంబానికే చెందిన ఇద్దరు మహిళలపై కొందరు ట్రాక్టరుతో కంకరమట్టి పోయించడం సంచలనమైంది.
శ్రీకాకుళం జిల్లాలో అమానుషం
వైకాపా అండతోనే వేధిస్తున్నారని బాధితుల ఆవేదన
హరిపురం (మందస), న్యూస్టుడే: శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో తమ కుటుంబానికే చెందిన ఇద్దరు మహిళలపై కొందరు ట్రాక్టరుతో కంకరమట్టి పోయించడం సంచలనమైంది. బాధితుల కథనం ప్రకారం... కుటుంబానికి చెందిన ఆస్తుల్లో తమకు న్యాయబద్ధంగా వాటా ఇవ్వాలని హరిపురానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రి పోరాడుతున్నారు. ఈ క్రమంలో స్థానిక హెచ్బీ కాలనీ సమీపంలో రహదారి పక్కన ఉమ్మడి ఆస్తి ఇంటి స్థలంలో దాలమ్మ భర్త నారాయణ అన్న కుమారుడు కొట్ర రామారావు కొద్ది రోజుల నుంచి ట్రాక్టర్లతో కంకరమట్టి తోలిస్తున్నారు. ఆ స్థలంలో తమకూ వాటా ఉందంటూ తల్లీకుమార్తె సోమవారం అక్కడికి వెళ్లారు. ట్రాక్టరుతో కంకరమట్టి వేస్తుండగా అభ్యంతరం తెలిపారు. మట్టి పోయకూడదంటూ ట్రాక్టరు వెనుక వైపునకు వెళ్లి కింద కూర్చున్నారు. అయినా పట్టించుకోకుండా వారిపై మట్టిని అన్లోడ్ చేశారు. మట్టిలో కూరుకుపోయిన తల్లీకుమార్తె విలవిల్లాడారు. కాపాడాలని కేకలు వేస్తూ రోదిస్తుండటంతో సమీపంలో ఉన్న కొందరు యువకులు వారిని బయటకు తీశారు. కుటుంబానికి చెందిన ఆస్తిలో తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా అడుగుతున్నామని, కక్షగట్టి కొట్ర రామారావు, కొట్ర ఆనందరావు, కొట్ర ప్రకాశరావు (వీరు దాలమ్మ భర్త నారాయణ సోదరులు సీతారాం, లక్ష్మీనారాయణ కుమారులు) తమపై మట్టి కప్పించి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు మందస పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొట్ర రామారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
భర్త కొట్ర నారాయణ మృతి చెందడంతో భార్య దాలమ్మ, ఆమె కుమార్తె సావిత్రి ఉమ్మడి ఆస్తుల్లో వాటా కోసం 2019 నుంచి పోరాడుతున్నారు. నారాయణ ఇద్దరు అన్నదమ్ములు సీతారాం, లక్ష్మీనారాయణతో సమానంగా తమకూ ఆస్తి ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఇందుకోసం గతంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే హోదాలో సీదిరి అప్పలరాజు కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దాలమ్మ బావ సీతారాం కుమారుడైన వైకాపా గ్రామ నాయకుడు కొట్ర రామారావు అదే గ్రామంలోని ఓ స్థలంలో కొద్ది రోజులుగా భవన నిర్మాణానికి పునాదులు తీసి అందులో కంకరమట్టి వేయిస్తున్నారు. ఆ స్థలంలో తమకూ వాటా ఉందని దాలమ్మ, సావిత్రి అడ్డుకోగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వైకాపా ప్రభుత్వానికి ఆ మట్టితోనే సమాధి కడతాం: చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: హరిపురంలో మహిళలపై వైకాపా నాయకులు మట్టి పోయించడంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై ఇంత దారుణానికి తెగిస్తారా? అని మండిపడ్డారు. ‘అహంకారంతో విర్రవీగుతున్న వైకాపా ప్రభుత్వ సమాధికి వాడబోయేది ఈ మట్టే అని గుర్తుంచుకోవాలి’ అని ఓ ప్రకటనలో హెచ్చరించారు.
* ‘వైకాపా నేతలు ట్రాక్టర్తో మహిళలపై మట్టిని పోయించి చంపాలని చూడటం దారుణం. వారు పశువుల మంత్రి అనుచరులు కావడంతో పోలీసులు ఈ దాష్టీకంపై స్పందించడం లేదు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మేం చచ్చిపోతున్నాం.. మమ్మల్ని కాపాడండి’ అంటూ మహిళలు ఆర్తనాదాలు చేస్తుంటే.. ‘చచ్చిపో పర్లేదు’ అని వైకాపా నాయకుడు అంటున్న వీడియోను ట్వీట్కు జతచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ