Amaravati: ప్రభుత్వానికి భంగపాటు
అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అన్ని వర్గాలూ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం రాజధాని ప్రాంత స్వరూపాన్ని మార్చేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది.
అమరావతి పురపాలక సంఘం ఏర్పాటుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత
ప్రభుత్వానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నివేదిక
ఈనాడు, అమరావతి: అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అన్ని వర్గాలూ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం రాజధాని ప్రాంత స్వరూపాన్ని మార్చేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు సెప్టెంబరు 12 నుంచి పాదయాత్ర ప్రారంభించినప్పుడే... అమరావతి కేంద్రంగా పురపాలక సంఘం ఏర్పాటుకు అదే నెల 12 నుంచి 16 వరకు గ్రామసభలు నిర్వహించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామ పంచాయతీల్లో అధికారులు సభలు ఏర్పాటుచేశారు. పాదయాత్రలో పాల్గొనగా.. గ్రామాల్లో మిగిలిన ప్రజలు, రైతులు గ్రామసభలకు హాజరై అమరావతి పురపాలక సంఘం ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పంచాయతీల్లో తీర్మానాలు చేయించారు. ఈ పరిణామాలతో 22 పంచాయతీల్లోనూ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పురపాలక సంఘం ఏర్పాటు ప్రతిపాదనలపై గ్రామసభల్లో ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని... ఇందుకు సంబంధించిన తీర్మానాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. సభలు నిర్వహించిన అన్నిచోట్లా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైన విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదిక పంపిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.
స్మార్ట్సిటీగా అభివృద్ధి చేయాలి
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) బృహత్తర ప్రణాళిక (మాస్టర్ప్లాన్) ప్రకారం అమరావతిని స్మార్ట్సిటీగా అభివృద్ధి చేయాలని 22 గ్రామసభల్లో ప్రజలు కోరారు. బృహత్తర ప్రణాళికను మార్చి, రాజధాని ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అమరావతి కేంద్రంగా పురపాలక సంఘం ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ ఏర్పాటు సందర్భంలోనూ చుక్కెదురు
రాజధాని అమరావతిలో కీలకమైన 19 పంచాయతీలను కలిపి ‘అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్’ పేరుతో ప్రత్యేక నగరపాలక సంస్థ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో చేసిన ప్రయత్నాన్నీ ప్రజలు తిప్పికొట్టారు. తుళ్లూరు మండలంలో 16, మంగళగిరి మండలంలో 3 పంచాయతీల్లో జనవరి 5-12 మధ్య నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్వ ప్రతిపాదనలను ప్రజలు వ్యతిరేకించారు. రాజధాని అమరావతి ప్రాంతం 29 గ్రామాలతో ఏర్పడింది. విభజించు, పాలించు తరహాలో ఇందులో 19 పంచాయతీలతో ప్రత్యేక నగరపాలక సంస్థ ఏర్పాటు ప్రతిపాదనను ప్రజలు వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానాలు చేశారు. సీఆర్డీఏ బృహత్తర ప్రణాళిక ప్రకారం రాజధాని అమరావతి ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని ప్రజలు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి