Polavaram project: పోలవరంలో అధనపు ఎత్తిపోత!
పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట, డయాఫ్రం వాల్ ప్రాంతంలో ఇప్పటికీ ఎలాంటి పనులూ చేసే పరిస్థితులు లేవు.
2 టీఎంసీలకుపైగా నీళ్లను ఖాళీ చేయాలి
పెద్ద ఎత్తున పంపులు, మోటార్లు అవసరం
దిగువ కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడమే కారణం
మరో 2 నెలలు కీలక పనులకు ఇబ్బందులే..
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట, డయాఫ్రం వాల్ ప్రాంతంలో ఇప్పటికీ ఎలాంటి పనులూ చేసే పరిస్థితులు లేవు. వర్షాలు తగ్గి, వరద ప్రవాహం మందగించినా ఆ ప్రాంతమంతా వరద నీటితో నిండి ఉంది. అదనంగా ఖర్చు పెట్టి ఆ నీళ్లన్నీ బయటికి ఎత్తిపోస్తే గానీ పనులు చేపట్టే అవకాశమే లేదు. మేఘా సంస్థ, ఏపీ జల వనరులశాఖలు సకాలంలో దిగువ కాఫర్ డ్యాం పూర్తి చేయలేకపోవడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. 2020 భారీ వరదలు, కోత సమస్యలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్దేశించిన గడువులోపు కూడా దిగువ కాఫర్ డ్యాంను పూర్తి చేయలేదని పోలవరం అథారిటీ సైతం తప్పు పట్టింది. 2022 మే నుంచి జులై లోపు అనేకసార్లు తాము సమీక్షించి, హెచ్చరించినా పని పూర్తి చేయలేదని, ఆ ప్రభావం రాబోయే రోజుల్లో ప్రాజెక్టు భవితవ్యంపై కూడా పడుతుందని అథారిటీ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఆ పరిణామాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. 2022 జులై నాటికి దిగువ కాఫర్ డ్యాం పూర్తి చేయలేకపోగా కనీసం రక్షిత స్థాయికి తీసుకురాలేకపోయారు. ఫలితంగా వరద నీరు దిగువ వైపు నుంచి వెనక్కు మళ్లి ఎగువ కాఫర్ డ్యాం వరకు ముంచెత్తింది. దిగువ కాఫర్ డ్యాం సకాలంలో నిర్మించి ఉంటే ఆ ప్రాంతంలో వరద నీరు చేరేది కాదు. గోదావరి వరదల సమయంలోనూ పనులు చేసేందుకు వీలుండేది. ఇప్పుడు వర్షాకాలం దాటినా పనులకు అవకాశం లేకుండా పోయింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఉన్న నీటిని ఎత్తిపోయడానికి నెల రోజులు పడుతుందని అధికారులే చెబుతున్నారు. రెండు నెలలు పట్టవచ్చనేది అనధికారిక సమాచారం.
2 టీఎంసీలకు పైగా నీళ్లు
పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం నిపుణులు గత వారం సందర్శించారు. ఆ సమయంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య 2.2 టీఎంసీల నీరు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పుడు ఆ నీటిని ఎత్తిపోయడానికి అదనంగా ఖర్చవుతుంది. ఇందుకు దాదాపు 80 హెచ్పీ విద్యుత్తు మోటార్లు, పంపులు వినియోగించాల్సి ఉందని అంచనాలు వేశారు. దాదాపు 70 నుంచి 80 విద్యుత్తు మోటార్లు వినియోగించి ఆ నీటిని ఎత్తి పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ నీరంతా ఎత్తిపోస్తే తప్ప కీలక పనుల్లో అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు.
2019 నవంబరులో పనులు చేపట్టినా..
రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గుత్తేదారును మార్చి మేఘా సంస్థకు అప్పగించారు. దిగువ కాఫర్ డ్యాం నిర్మాణంలో మొత్తం 25.46 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పని చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే పనులు ప్రారంభించి, 3.37 లక్షల క్యూబిక్ మీటర్ల మేర చేశారు. మిగిలిన 22.09 లక్షల క్యూబిక్ మీటర్ల పనిని నవంబర్లో ప్రారంభించిన గుత్తేదారు మూడేళ్లవుతున్నా పూర్తి చేయలేదు.
తప్పు పట్టిన పోలవరం అథారిటీ
పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాంను 2020 నవంబరులో ప్రారంభించి 2021 జులై నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. 2020లో వరదలకు భారీ కోత ఏర్పడటంతో ఆ గడువు లోపు పూర్తి కాలేదనుకున్నా.. 2022 జులై నాటికి పెంచిన గడువులోపు పూర్తి చేయలేకపోయారని పోలవరం అథారిటీ తప్పు పట్టింది. తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ హెచ్చరించినా పనులు ప్రణాళికాబద్ధంగా చేయలేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.