PM modi: మీతో అనుబంధం.. రాజకీయాలకు అతీతం
‘కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా మీతో (ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి) మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం.
రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు.. ఉండదు... ఉండబోదు
ప్రధాని మోదీని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు
ఈనాడు- విశాఖపట్నం, అమరావతి: ‘కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా మీతో (ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి) మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలుతప్ప మాకు మరో ఎజెండా లేదు. ఉండదు. ఉండబోదు సార్’ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ‘ఎనిమిదేళ్ల కిందట తగిలిన అతి పెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. ఆ గాయాలు మానేలా.. విశాల హృదయంతో మీరు చేసే ప్రతి సాయమూ, ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థా, అదనంగా ఇచ్చే ప్రతి రూపాయీ మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడతాయి. మా రాష్ట్రం, మా ప్రజల కోసం మీరు చేసే ఏ మంచినైనా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను గుర్తు పెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు... మీరు మాపై పెద్ద మనసు చూపితే దానినీ గుర్తుపెట్టుకుంటారు’ అని విన్నవించారు. విశాఖపట్నం సభలో శనివారం ఆయన ప్రసంగించారు. విభజన హామీలు, పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్ తదితర అంశాలపై ఇప్పుడు, ఇంతకుముందూ వివిధ సందర్భాల్లో ఇచ్చిన వినతులను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటన్నింటినీ పరిష్కరించాలని ప్రధాన మంత్రిని జగన్ కోరారు. ‘రూ.10,740 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున నిండు మనసుతో కృతజ్ఞతలు చెబుతున్నా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ రెండు చేతులు పైకెత్తి ప్రధానికి నమస్కరించారు.
వికేంద్రీకరణ ప్రాధాన్యంగా అడుగులు వేశాం
‘మూడున్నరేళ్లలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత, గడప వద్దకే పరిపాలన, పిల్లల చదువులు, ప్రజలందరికీ వైద్యం, ఆరోగ్యం, రైతులు, మహిళల సంక్షేమం, సామాజిక న్యాయం వంటివి ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడం అంటే రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి... ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపాం. మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయినీ సద్వినియోగం చేశాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తి మేరకు మేము చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు, సహృదయులైన మీరు (మోదిని ఉద్దేశించి) మీ సహాయ, సహకారాలను మరింతగా అందించి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా. మంచి చేసే మా ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు (మోదీ వైపు తిరిగి నమస్కరిస్తూ) ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా’ అని జగన్ పేర్కొన్నారు.
కెరటాలకు మించి జనకెరటం
‘చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తున్నాయి. కార్తిక పౌర్ణమివేళ ఎగిసిపడిన కెరటాలకు మించి ఈ రోజు జన కెరటం ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే ప్రజా కవి, గాయకుడు వంగపండు పాడిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ పాట గుర్తుకొస్తొంది. ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదలివచ్చారు. ఇదే నేలపై నడయాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే.. ‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్’ అంటూ కదలివచ్చిన లక్షల జన సందోహం మన ఎదుట కనిపిస్తోంది. ‘దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ మాటలు మనందరికీ కర్తవ్యబోధ చేస్తున్నాయి. ప్రజాభిమానంతోపాటు వారి ఆకాంక్షలకు ఇక్కడకు వచ్చిన జన సాగరం అద్దం పడుతోంది’ అని జగన్ వ్యాఖ్యానించారు.
సాంతం సాగిలపడుతూ...
విశాఖ సభలో సీఎం జగన్ ప్రసంగం సాంతం ప్రధాన మంత్రికి సాగిలపడుతూ సాగింది. ఆయన ప్రసంగంలో పదేపదే ప్రధాని మోదీని ఉద్దేశించి ‘సార్.... సార్ .. సార్’ అంటూ సంబోధించారు. పెద్ద మనసుతో, విశాల హృదయంతో తమ సమస్యలు, వినతులు పరిష్కరించాలంటూ వేడుకున్నారు. ప్రసంగంలో మోదీకి రెండు సార్లు చేతులెత్తి నమస్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్