Andhra News: శివాలయానికి వైకాపా రంగులతో విద్యుద్దీపాలు

ఏపీలో గతంలో ప్రభుత్వ భవనాలు, గృహ సముదాయాలు, వంతెనలు, నీటి ట్యాంకులు తదితర వాటికి వైకాపా రంగులు వేయడం వివాదాస్పదంగా మారగా.. తాజాగా ఓ శివాలయానికి ఆ పార్టీ రంగులతో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం గమనార్హం.

Updated : 14 Nov 2022 07:34 IST

కడియం, న్యూస్‌టుడే: ఏపీలో గతంలో ప్రభుత్వ భవనాలు, గృహ సముదాయాలు, వంతెనలు, నీటి ట్యాంకులు తదితర వాటికి వైకాపా రంగులు వేయడం వివాదాస్పదంగా మారగా.. తాజాగా ఓ శివాలయానికి ఆ పార్టీ రంగులతో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం ఆదివారం రాత్రి వైకాపా రంగుల విద్యుత్తు దీపాల వెలుగుల్లో కనిపించింది. ఈ ఆలయ పాలకవర్గానికి వైకాపా నేత ఛైర్మన్‌గా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని