Narsapuram: నల్లదుస్తులతో వస్తే అనుమతి లేదు
నరసాపురంలో సోమవారం నిర్వహించిన సీఎం సభ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నల్ల దుస్తులు ధరించిన వారిని లోపలికి రానివ్వలేదు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను, నల్ల చున్నీలు ధరించిన యువతులు, మహిళలనూ అనుమతించలేదు.
సీఎం సభ వద్ద పోలీసుల అత్యుత్సాహం
ఈనాడు డిజిటల్, భీమవరం: నరసాపురంలో సోమవారం నిర్వహించిన సీఎం సభ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నల్ల దుస్తులు ధరించిన వారిని లోపలికి రానివ్వలేదు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను, నల్ల చున్నీలు ధరించిన యువతులు, మహిళలనూ అనుమతించలేదు. చున్నీలు తీసేసి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో కొందరు నిరాకరించి వెనుదిరిగారు. సోమవారం ఉదయం వర్షం కురవడంతో నలుపు రంగు రెయిన్కోట్లు వేసుకువచ్చినవారినీ అవి తీసి పక్కనపెట్టి, లోపలికి వెళ్లాలని ఆదేశించారు. సభ మరికొద్దిసేపట్లో మొదలవుతుందనగా సీపీఐ నరసాపురం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు బురఖా వేసుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని, గాజులు వేసుకుని ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
హాజరుపై పక్కా లెక్క
నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలందర్నీ సభకు తరలించారు. పాలకొల్లు నుంచే 50 బస్సుల్లో మహిళా సంఘాల వారిని తీసుకొచ్చారు. తప్పనిసరిగా రావాలని, రాకపోతే రుణాలు మంజూరు కావని ఏపీఎంలు బెదిరించడంతో వచ్చామని పలువురు చెప్పారు. గ్రూపుల వివరాలు, సభ్యుల పేర్లున్న రిజిస్టర్లు తీసుకుని అందరూ వచ్చారో లేదోనని పరిశీలించారు. వెళ్లేటప్పుడూ అందరూ ఉన్నారా, మధ్యలో ఎవరైనా వెళ్లిపోయారా అని ఆరా తీశారు.
ఇదేం ఖర్మరా బాబోయ్..
సీఎం పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచే నరసాపురంలో దుకాణాలు మూసేశారు. కార్తిక మాసం చివరి సోమవారం గుడికి వెళ్లనివ్వకుండా పోలీసులు ఆంక్షలు పెట్టారని పలువురు వాపోయారు. ఉదయం 8 గంటల నుంచే రహదారులపై తిరగనివ్వకపోవడంతో ఇదేం ఖర్మరా బాబోయ్ అని ప్రజలు అసహనం ప్రకటించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలించిన మహిళలతో సభా ప్రాంగణం నిండిపోయింది. చాలా మంది నిలబడలేక వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా అధికారులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్ల కింద నుంచి దూరి జనం బయటికి వెళ్లారు.
ఉద్యోగులకు జన సమీకరణ బాధ్యత
భీమవరం అర్బన్, న్యూస్టుడే: నరసాపురంలో ముఖ్యమంత్రి బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. వివిధ శాఖల అధికారులు, సచివాలయాల ఉద్యోగులకు ఈ బాధ్యత అప్పగించారు. వాలంటీర్ల సహకారంతో క్షేత్రస్థాయి ఉద్యోగులు అన్ని గ్రామాల నుంచి ప్రజలను విద్యా సంస్థల బస్సుల్లో తీసుకెళ్లారు. వారికి అవసరమైన ఆహారాన్ని పొట్లాలుగా కట్టడం, పంపిణీ చేయడం వంటి పనులన్నీ డీఆర్డీఏ, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆరోగ్య, ఐసీడీఎస్వంటి శాఖల ఉద్యోగులే పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా 1200 బడి బస్సులు ఉండగా 600 బస్సుల్లో ప్రజలను తరలించినట్లు అంచనా. ఈ క్రమంలో ఎక్కువ బస్సులున్న పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల బస్సులను సభకు తరలించేలా ప్రభుత్వం రవాణాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల నుంచి 100 ఆర్టీసీ బస్సులను సీఎం సభకు మళ్లించారు. దీంతో పలు మార్గాల్లో ప్రయాణికులకు గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు.
తెదేపా, భాజపా నాయకుల గృహ నిర్బంధం
భీమవరం పట్టణం, న్యూస్టుడే: సీఎం పర్యటన నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు చేస్తారనే సమాచారంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా తెదేపా, భాజపా నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అత్తిలి, వీరవాసరం, భీమవరం, నరసాపురాల్లో ఈ పార్టీల నాయకుల్లో కొందరిని ఆదివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మరికొందరిని సోమవారం ఉదయం నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మను పోలీస్స్టేషన్ నుంచి సోమవారం తెల్లవారుజామున పంపించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరంలో 50 మంది నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. నరసాపురంలో తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, తెలుగు యువత నాయకులు పార్టీ కార్యాలయం నుంచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. భీమవరం, అత్తిలిలో తెలుగు యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులను గృహనిర్బంధంలో ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం