Guntur: గుంటూరులో కూల్చివేతల కలకలం
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత ఘటన మరవకముందే గుంటూరు నగరంలో ఇళ్ల కూల్చివేత చర్చకు దారితీసింది.
చంద్రయ్య కాలనీలో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్ల తొలగింపు
నోటీసివ్వకుండా నోటి మాటగా చెప్పి ఉదయమే కూల్చివేత
కాళ్లావేళ్లా పడినా కనికరించని అధికారులు
పరిహారమిచ్చి ప్రత్యామ్నాయం చూపాలంటున్న బాధితులు
ఈనాడు- అమరావతి, న్యూస్టుడే - నగరంపాలెం: ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత ఘటన మరవకముందే గుంటూరు నగరంలో ఇళ్ల కూల్చివేత చర్చకు దారితీసింది. స్థానిక శ్రీనగర్కాలనీలోని చంద్రయ్యనగర్లో రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లను అధికారులు కూల్చడం కలకలం రేపింది. ముందస్తు నోటీసులు లేకుండా, తగినంత సమయం ఇవ్వకుండా ఉన్నపళంగా ఇళ్లను కూల్చితే తాము ఎక్కడికి వెళ్లాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి అధికారులు వచ్చి ఇళ్లను కూల్చేస్తామని చెప్పి, బుధవారం ఉదయాన్నే పొక్లెయిన్లు తెచ్చి కూలగొట్టారని వాపోతున్నారు.సామగ్రి సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని, పరిహారం గురించి తేల్చకుండా కట్టుబట్టలతో ఎక్కడికెళ్లాలని కన్నీటిపర్యంతమవుతున్నారు.
గుంటూరు నగరంలో చంద్రయ్యనగర్ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటైంది. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన బీ-ఫారం స్థలాల్లో చాలామంది పేదలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. 2015లో కృష్ణా పుష్కరాల సమయంలో రహదారుల విస్తరణలో భాగంగా అమరావతి రోడ్డు నుంచి ఠాగూర్ విగ్రహం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థానికులకు నోటీసులు ఇచ్చారు. శ్రీనగర్కాలనీ వైపు నిర్మాణాలు కొట్టేసిన నగరపాలక సంస్థ వాటికి పరిహారం, స్థలాలకు బాండ్లు ఇచ్చింది. చంద్రయ్యనగర్ వైపు రోడ్డు విస్తరణపై కొందరు కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు విస్తరణ పనులు చేపట్టారు. మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ అధికారులు వచ్చి ఇళ్లు తొలగిస్తామని, సామగ్రి తీసుకెళ్లిపోవాలని నోటిమాటగా చెప్పారని బాధితులు అంటున్నారు. బుధవారం ఉదయాన్నే పొక్లెయిన్లు, జేసీబీలతో వచ్చి కూల్చివేతలు ప్రారంభించారు. అరవై ఏళ్లకు పైగా నివాసం ఉంటున్నామని.. ఒక్క పూటలో ఖాళీ చేయమంటే ఎలా అని, కొంత సమయమివ్వాలని వారు కోరినా యంత్రాంగం పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలంటూ కూల్చివేతలు కొనసాగించారు. సామగ్రి సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని నివాసితులు వాపోయారు. ఉన్నపళంగా ఇల్లు కూల్చేస్తే తాము రోడ్డున పడతామని, ఎక్కడివెళ్లాలని జమయ్మ అనే మహిళ పొక్లెయిన్ తొట్టెలో కూర్చుని నిరసన తెలిపారు. బడ్డీకొట్టు పెట్టుకుని జీవించే తమకు గూడు లేకుండా చేయవద్దని వేడుకున్నారు. స్థానికులు అడ్డుతగలడంతో అధికారులు జయమ్మ ఇల్లు కూల్చకుండానే వెనుదిరిగారు. కొందరి ప్రహరీలు, మరుగుదొడ్లు కూల్చేశారు. చంద్రయ్యనగర్లో పది ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలు కూల్చివేయగానే స్థానికులు, తెదేపా నాయకులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు.
వేదన మిగిల్చిన యంత్రాంగం
గత ప్రభుత్వ హయాంలో ప్రధాన రహదారికి కుడివైపు ఉన్న స్థలాలను విస్తరణలో భాగంగా తొలగించి, వారికి పరిహారం ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండా, పరిహారం ప్రకటించకుండా అధికారులు హడావుడిగా ఇళ్లు, ప్రహరీలను కూల్చివేసి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. బీ-ఫారం స్థలాలు అయినందున మా వేదనను పట్టించుకోకుండా కూల్చేశారని వాపోయారు. కొన్నేళ్లుగా నీటిపన్ను, ఇంటిపన్ను చెల్లిస్తున్నా ఇప్పుడు పరిహారం రాదని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. తామంతా చిరువ్యాపారులమేనని, నగరానికి దూరంగా ఎక్కడో ఇళ్లస్థలాలు ఇస్తే తమ జీవనోపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల్లో పరిహారం ఇస్తాం
‘అమరావతి రోడ్డు నుంచి డొంకరోడ్డు అరండల్పేట పదో లైను చివర ఠాగూర్ విగ్రహం వరకు విస్తరణ చేయాలని 2015లో నిర్ణయించారు. అప్పట్లో నోటీసులిచ్చి విస్తరణ చేపట్టాం. కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. శంకర్విలాస్ వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గం ఇదే. అందుకే ఇప్పుడు విస్తరిస్తున్నాం. దీనిలో భాగంగా చంద్రయ్యనగర్లో 51 ఇళ్ల నిర్మాణాలు తొలగించాలని గుర్తించాం. ఇందులో 23 మందికి బీ-ఫారాలు, 18 మంది వద్ద స్వాధీన ఒప్పందాలు ఉన్నాయి. 10 మంది వద్ద ఎలాంటి కాగితాల్లేవు. బీ-ఫారాలున్న 28 మందికి నిర్మాణాలు కోల్పోతున్నంత వరకు లెక్కించి పరిహారం అందిస్తాం. స్వాధీన ఒప్పందాలున్నవారికి పరిహారం బీ-ఫారాలు పొందినవారికి ఇవ్వాలా? ప్రస్తుతం పొజిషన్లో ఉన్నవారికి ఇవ్వాలా అనేది కౌన్సిల్ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బుధవారం కొట్టేసిన 10 ఇళ్ల నిర్మాణాలకు రెండు రోజుల్లో పరిహారం చెక్కులు ఇస్తాం’ అని నగరపాలకసంస్థ వర్గాలు తెలిపాయి.
హఠాత్తుగా ఖాళీ చేయమంటే ఎలా?
30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం. మంగళవారం రాత్రి అధికారులు వచ్చి తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలన్నారు. అద్దె ఇంటికి రూ.5 వేలు, కరెంట్ బిల్లులు కట్టుకునే పరిస్థితి లేదు. నగరంలోనే ఒక సెంటు భూమి ఇస్తే గుడిసె వేసుకొని బతుకుతాం.
- కత్తి జయమ్మ, చంద్రయ్యనగర్
పరిహారం ఇచ్చాకే విస్తరణ చేపట్టాలి
నగరపాలకసంస్థ అధికారులు మంగళవారం నోటిమాటగా చెప్పి బుధవారం ఉదయాన్నే జేసీబీలతో వచ్చి పేదల ఇళ్లు కూల్చడం దారుణం. ఇక్కడ నివసిస్తున్నవారంతా చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతికేవాళ్లే. కనీస సమయం ఇవ్వకుండా పరిహారం తేల్చకుండా ఇక్కడి నుంచి పంపించేయాలని చూడటం దుర్మార్గం. అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించారు. పేదలకు పరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే రోడ్డు విస్తరణ చేపట్టాలి. లేకపోతే బాధితులతో కలిసి అధికారులను అడ్డుకుంటాం.
- మద్దిరాల మ్యానీ, మాజీ కార్పొరేటర్, గుంటూరు
హఠాత్తుగా వచ్చి ఇల్లు కూల్చేస్తామన్నారు
60 ఏళ్లుగా శ్రీనగర్లోని చంద్రయ్యనగర్లో నివాసం ఉంటున్నాం. నా ఇద్దరు కుమారులు ఒకరు హైదరాబాద్లో, మరొకరు గుంటూరులో ఉంటున్నారు. భర్త మరణించడంతో ఒంటరిగా బతుకుతున్నా. బుధవారం ఉదయం హఠాత్తుగా అధికారులు వచ్చి ఇల్లు కూల్చివేయాలని చెప్పారు. ఒంటరిగా బతుకుతున్నానని, జాలి చూపాలని వేడుకున్నా కరుణించలేదు. మా ఇంటి మరుగుదొడ్డి కూల్చివేశారు. గురువారం ఉదయం ఇల్లు కూల్చేస్తామని చెప్పి వెళ్లారు. 68 ఏళ్ల వయసులో నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలి?
- భాస్కరమ్మ, చంద్రయ్యనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ