భూవివాదాలు తగ్గించేందుకే హక్కుపత్రాలు
‘రాష్ట్రంలో భూముల సమగ్ర రీ సర్వే ద్వారా భూదస్త్రాల ప్రక్షాళన జరుగుతోంది. ఇప్పటికే 2వేల గ్రామాల్లోని 7.92 లక్షల మందికి సంబంధించిన భూముల సర్వే పూర్తయింది.
2023 డిసెంబరు నాటికి రీసర్వే పూర్తిచేస్తాం
మూడున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు
నరసన్నపేట సభలో సీఎం జగన్
ఈనాడు డిజిటల్-శ్రీకాకుళం, న్యూస్టుడే-నరసన్నపేట: ‘రాష్ట్రంలో భూముల సమగ్ర రీ సర్వే ద్వారా భూదస్త్రాల ప్రక్షాళన జరుగుతోంది. ఇప్పటికే 2వేల గ్రామాల్లోని 7.92 లక్షల మందికి సంబంధించిన భూముల సర్వే పూర్తయింది. వారందరికీ హక్కుపత్రాలు అందిస్తున్నాం. తర్వాత 17,584 రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని భూ రికార్డులన్నింటినీ సర్వేచేసి 2023 డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియను పూర్తిచేస్తాం. భూ యజమానులకు హక్కుపత్రాలు చేతిలో పెడతాం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రెండోవిడత భూ సర్వేను బుధవారం ఆయన ప్రారంభించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు నమూనా హక్కుపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముందుగా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు.
‘భూముల విలువ పెరగడంతో అక్రమాలు పెరిగిపోయాయి. వీటివల్ల ప్రజలు పడుతున్న అగచాట్లను పాదయాత్రలో చూశాను. సంపాదించుకున్న, వారసత్వంగా వచ్చిన ఆస్తిని పిల్లలకు ఇచ్చే సమయానికి ఎవరో వచ్చి గద్దల్లా తన్నుకుపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే కష్టంగా ఉంది.
కోర్టుల్లోని సివిల్ కేసుల్లోనూ 80-90 శాతం భూ వివాదాలవే. వాటిని తగ్గించాలనే భూములన్నింటికీ కొలతలు వేసి, పూర్తి వివరాలతో కూడిన హక్కుపత్రాలు అందిస్తున్నాం. ఇక ఎవరో వచ్చి సర్వేనంబర్లు మార్చేయడానికి, సబ్ డివిజన్లు చేసి క్రయ, విక్రయాలు చేయడానికి ఆస్కారం ఉండదు. సర్వే పూర్తయితే భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ సేవలు గ్రామ సచివాలయాల్లోనే అందుతాయి. లంచాలకు తావులేకుండా చేస్తున్నాం.
విలేజ్ సర్వేయర్లకు గ్రేడ్-2 పదోన్నతి
రాష్ట్రంలోని విలేజ్ సర్వేయర్లకు పదోన్నతి కల్పిస్తున్నాం. భూసర్వేలో సమర్థంగా విధులు నిర్వహిస్తున్న సచివాలయాల్లోని సర్వేయర్లను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2గా మారుస్తున్నాం.
అందుకే మూడు రాజధానులు
గ్రామ సచివాలయాల్లో 1.3 లక్షల శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టాం. కుప్పం సహా 25 రెవెన్యూ డివిజన్లను కొత్తగా ఇచ్చాం. రాష్ట్రంలో రాజధాని ఒకేచోట ఉంటే జరిగే మంచి కన్నా... మూడు ప్రాంతాలు బాగుపడాలని రాజధానుల్ని మూడు ప్రాంతాలకు ఇచ్చాం. కొత్తగా 17 ప్రభుత్వ వైద్యకళాశాలలు కడుతున్నాం. ఇచ్ఛాపురం, పలాస ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం రూ.756 కోట్లతో తాగునీరు అందించేందుకు, రూ.50 కోట్లతో కిడ్నీ పరిశోధన ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
రాముడెవరో.. రావణుడెవరో..
తన భార్య కోసం యుద్ధం చేస్తే శ్రీరాముడు అంటారు. అదే పరాయి స్త్రీ మీద కన్నేసి ఎత్తుకుపోవాలని చూస్తే రావణుడు అంటారు. తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే వాళ్లను ఎంజీఆర్.. ఎన్టీఆర్.. జగన్ అంటారు. సొంత కుమార్తెను ఇచ్చిన మామను, ఆయన పెట్టిన పార్టీని, ట్రస్టును, చివరికి ప్రజలిచ్చిన సీఎం కుర్చీని వెన్నుపోటు పొడిచి కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటారు’ అని సీఎం పేర్కొన్నారు.
ఒక్క మంచి పనైనా చేశారా: మంత్రి ధర్మాన
అంతకు ముందు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ‘తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు ప్రయోజనం కలిగించే ఒక్క పనైనా చేశారా? చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఓట్లేసి అధికారం ఇచ్చిన వెనుకబడిన జిల్లాకు ఏ గొప్ప పని చేశారో చెప్పండి. రోడ్లమీద గోతులు ఉన్నాయంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సరైన రోడ్డు వేసుంటే మూడున్నరేళ్లకే ఎందుకు గుంతలు పడతాయి? చంద్రబాబు రాష్ట్రానికి దూరంగా, జూమ్ కెమెరాకు దగ్గరగా ఉంటారు. విశాఖలో రాజధాని పెడితే మీకు వచ్చిన ఇబ్బందేంటి? మా రాజధాని వద్దని చెప్పడానికి, అమరావతి నుంచి కొంతమందిని తీసుకొచ్చి.. మాచేత్తో మా కళ్లు పొడిపిస్తారా? పాదయాత్ర వచ్చుంటే ఈ నాలుగు జిల్లాల్లో ఏ ఒక్కరూ తెదేపాకు ఓటేసేవారు కారు’ అని అన్నారు.
సీఎం బందోబస్తులో ట్రాఫిక్ హెడ్కానిస్టేబుల్ మృతి
జలుమూరు, నరసన్నపేట, అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: నరసన్నపేటలో ముఖ్యమంత్రి సభ సందర్భంగా విధి నిర్వహణకు వచ్చిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఎర్రంశెట్టి అప్పారావు(54) మరణించారు. మధ్యాహ్నం 12.30 సమయంలో ఛాతిలో నొప్పి వస్తున్నట్లు తోటి సిబ్బందికి చెప్పగా వెంటనే 108లో ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తులో ఉన్న మరో హెడ్ కానిస్టేబుల్ కె.వి. రమణకృష్ణ కూడా ఉదయం 11 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి ప్రథమచికిత్స అందించి విశాఖకు తరలించారు.
బాలిక వైద్యానికి భరోసా
నరసన్నపేట, సారవకోట, న్యూస్టుడే: ఏడేళ్లుగా తలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి మీసాల ఇంద్రజను ఆదుకునేందుకు సీఎం జగన్ ముందుకొచ్చారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం చినశిర్లాం గ్రామానికి చెందిన మీసాల ఇంద్రజ వయసు ఏడేళ్లు. ఈమె తల పెద్దగా పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి వస్తున్నారని.. ఆమెను తల్లి కృష్ణవేణి హెలిప్యాడ్ వద్దకు తీసుకొచ్చారు. సభాస్థలికి వెళుతున్న సీఎం జగన్.. వెంటనే వాహనం దిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంద్రజ తండ్రి అప్పలనాయుడు కిడ్నీ వ్యాధి బాధితుడు. బిడ్డ వైద్యానికి ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చుచేశామని, మరో రూ.20 లక్షలు అవుతుందని వైద్యులు చెబుతున్నారని సీఎంకు కృష్ణవేణి వివరించారు. దీంతో.. చికిత్సఖర్చును ప్రభుత్వం నుంచి భరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇంద్రజకు ఇస్తున్న పింఛను మొత్తాన్ని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం ఇంద్రజ ఆరోగ్యంపై కలెక్టర్ శ్రీకేశ్ బి.లఠ్కర్ ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. వైద్య పరీక్షల నిమిత్తం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్