పట్టభద్ర ఓటర్లు 8.99 లక్షలు.. ఉపాధ్యాయ ఓటర్లు 43,170

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగబోయే శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది.

Updated : 24 Nov 2022 06:19 IST

ముసాయిదా జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగబోయే శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 8,99,280 మంది, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలో 43,170 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల నియోజకవర్గాలకు 975, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు 348 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా వివరాలు తెలిపారు. ముసాయిదా జాబితాపై డిసెంబరు 9వ తేదీ వరకూ అభ్యంతరాలు, క్లెయిములు స్వీకరిస్తారు. అర్హులై ఉండి ఓటర్ల జాబితాలో పేరు లేనివారు కూడా ఈ గడువు తేదీలోగా ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు.  డిసెంబరు 30న తుది జాబితా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీలు వై.శ్రీనివాసులరెడ్డి, వెన్నపూస గోపాలరెడ్డి, విఠపు బాలసుబ్రమణ్యం, కత్తి నరసింహారెడ్డి, పీవీఎన్‌ మాధవ్‌ల పదవీకాలం 2023 మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని