మాస్టర్ ప్లాన్ సవరణలకు ససేమిరా
రాజధాని మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించిన ఆర్-5 జోన్ ఏర్పాటును అమరావతి రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు.
రాజధానిలో ప్రతిపాదిత ఆర్-5 జోన్ను ముక్తకంఠంతో వ్యతిరేకించిన రైతులు
ముగిసిన అభిప్రాయ సేకరణ
ఈనాడు, అమరావతి: రాజధాని మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించిన ఆర్-5 జోన్ ఏర్పాటును అమరావతి రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. బృహత్ ప్రణాళికలో మార్పు, చేర్పులు చేయడాన్ని అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. 9 రోజులుగా సాగిన ప్రజాభిప్రాయ సేకరణ బుధవారంతో ముగిసింది. గత నెలలో మాస్టర్ ప్లాన్లో చేసిన మార్పులపై ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసి, రైతుల నుంచి అభ్యంతరాలు ఆహ్వానించింది. ఇందుకోసం అధికారులు గతనెల 28 నుంచి ఈనెల 11 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ నెల 14 నుంచి విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో వారి వాంగ్మూలాలను సేకరించారు. 5,744 మంది అభ్యంతరాలపై పత్రాలు ఇవ్వగా.. 4 వేల మందికిపైగా అధికారుల ఎదుట అభిప్రాయాలు తెలిపారు.
వచ్చిన అభ్యంతరాలు ఇవీ..
* ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల వరకు మాస్టర్ ప్లాన్ను మార్చడానికి వీల్లేదు. ఆ తర్వాత కూడా రైతుల అంగీకరిస్తేనే సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాంటిది మేం సమ్మతి తెలపకుండానే ఎలా మారుస్తారు? పైగా పంచాయతీ ప్రత్యేకాధికారులకు ప్లాన్కు సంబంధించి ఎటువంటి హక్కులు, అధికారాలు ఉండవు. ఈ నేపథ్యంలో ప్రతిపాదనల ఆధారంగా సీఆర్డీఏ ఎలా నిర్ణయం తీసుకుంటుంది?
* రాజధానిలోని నిరుపేదల ఇళ్ల కోసమని మాస్టర్ ప్లాన్లోనే స్థలాలు రిజర్వు చేసి ఉంచారు. ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలోని నిరుపేదలను గాలికొదిలేసి, ఇతర ప్రాంతాల వారికి కేటాయిస్తామనడం ఎంత వరకు సమంజసం? గత ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా పడావుపెడుతున్నారు.
* గతంలో పరిశ్రమలకు కేటాయించిన ప్రాంతాన్ని ఇప్పుడు నివాస స్థలాలకు ఎలా కేటాయిస్తారు? ప్రభుత్వ చర్య కారణంగా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.
మాకు ఆత్మహత్యలే శరణ్యం
పలువురు రైతులు, మహిళలు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ను ఆయన ఛాంబర్లో కలిశారు. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా సీఆర్డీఏ వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జోన్ను తీసుకురావాల్సిన అవసరమేంటని నిలదీశారు. రాజధానిలో ఉండే వారికి, వలస వచ్చే వారికి సెంటు చొప్పున స్థలాలు ఇస్తామనడం వలసలను ప్రోత్సహిస్తున్నట్లు కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ మీరు ముందుకే సాగితే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
సర్కారే ప్రాణాలు తీస్తోంది
రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
సంక్షిప్త వార్తలు
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
గులకరాయి కేసులో కస్టడీ పిటిషన్పై ముగిసిన వాదనలు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది.