తలనీలాల వేలంలో తితిదేకు రూ.47.92 కోట్ల ఆదాయం

శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలకు తితిదే ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించగా రూ.47.92 కోట్ల ఆదాయం లభించిందని ఆ విభాగం జీఎం కృష్ణారెడ్డి తెలిపారు.

Published : 25 Nov 2022 04:26 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలకు తితిదే ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించగా రూ.47.92 కోట్ల ఆదాయం లభించిందని ఆ విభాగం జీఎం కృష్ణారెడ్డి తెలిపారు. ఈ-వేలం సైట్‌లో తితిదే గురువారం వివిధ రకాల సైజుల్లోని తలనీలాలకు వేలం నిర్వహించగా పాటదారులు 21,100 కేజీలకు బిడ్‌ చేశారు.

సర్వదర్శనానికి 15 గంటలు

గురువారం సాయంత్రానికి ధర్మదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 15 గంటల్లో  దర్శనం లభించనుందని తితిదే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు