కేంద్ర ఆర్థిక మంత్రితో బుగ్గన, రావత్‌ భేటీ నేడు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ భేటీ కానున్నారు.

Updated : 25 Nov 2022 06:16 IST

ఈనాడు, అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ భేటీ కానున్నారు. ఇందుకోసం వారు దిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో ఆర్థిక అంశాలను చర్చించేందుకు వీరు సమావేశమవుతున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని రుణాల కోసం కేంద్రం అనుమతులివ్వాల్సి ఉంది. ఇప్పటికే కేంద్రం ఇచ్చిన పరిమితి మేరకు రుణాలు వినియోగించుకోవడంతో కొత్త రుణాల కోసం ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్ర అవసరాలు వివరించి రుణ అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొనాలంటే కొత్త అనుమతులు రావాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని