న్యాయమూర్తుల బదిలీపై లాయర్ల నిరసన
న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ల ఆకస్మిక బదిలీ ప్రక్రియపై ఏపీ హైకోర్టులో నిరసనలు వెల్లువెత్తాయి. న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు.
హైకోర్టులో విధులు బహిష్కరించి ర్యాలీ
హైకోర్టు న్యాయవాదుల సంఘ సభ్యుల అత్యవసర సమావేశం
బదిలీలను నిలిపేయాలని సీజేఐకి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం
ఈనాడు, అమరావతి: న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ల ఆకస్మిక బదిలీ ప్రక్రియపై ఏపీ హైకోర్టులో నిరసనలు వెల్లువెత్తాయి. న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. నెక్బ్యాండ్లను తొలగించి నిరసన తెలిపారు. శుక్రవారం కోర్టు ప్రారంభ సమయంలో ప్రతి కోర్టు హాలుకు వెళ్లి అక్కడున్న న్యాయవాదులను విధుల బహిష్కరణకు సహకరించాలని కోరారు. బదిలీలపై శాంతియుత నిరసన చేపట్టినట్లు న్యాయమూర్తులకు తెలియజేశారు. న్యాయవాదులందరూ కోర్టు హాళ్ల నుంచి బయటకు రావడంతో కేసులను వాయిదా వేస్తూ న్యాయమూర్తులు బెంచ్ దిగిపోయారు. ఆ తర్వాత న్యాయవాదులందరూ హైకోర్టు వెలుపలకు వచ్చి.. అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలని నినదించారు. హైకోర్టు వద్ద ఉన్న జాతీయ పతాకం నుంచి సమీపంలోని క్యాంటీన్ వరకు ర్యాలీ చేపట్టారు. పేదలు, అణగారిన వర్గాలకు సైతం న్యాయం జరుగుతుందన్న భరోసా వారి తీర్పుల ద్వారా కల్పించి ప్రజా న్యాయమూర్తులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరినీ ఏకపక్షంగా, సరైన కారణం లేకుండా ఆకస్మికంగా బదిలీ చేయడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. వీరి బదిలీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై నిష్పక్షపాతంగా తీర్పులిస్తున్నందునే కక్షసాధింపుగా వారిని బదిలీ చేయించారన్నారు. ఇది మిగిలిన న్యాయమూర్తుల పనివిధానంపై ప్రభావం చూపుతుందన్నారు. అటెండర్ అయినా ఐఏఎస్ అయినా కోర్టు దృష్టిలో అందరూ సమానమే అనేంత నిష్పాక్షికంగా ఆ న్యాయమూర్తులు వ్యవహరించారన్నారు. అలాంటి వారిని రాత్రికి రాత్రి బదిలీ చేస్తే హైకోర్టు, న్యాయవాదులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. న్యాయమూర్తులకు ఇబ్బంది తలెత్తితే వారు బయటకు వచ్చి మాట్లాడలేరు కాబట్టి వారి పక్షాన న్యాయవాదులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో న్యాయవాదులందరూ ఒక్కమాటపై నిలబడి అక్కడి న్యాయమూర్తి బదిలీని నిలిపేయించుకున్నారని.. అదే తరహాలో మనం కూడా ఏకతాటిపై వచ్చి బదిలీలను ఆపించుకోవాలన్నారు. ఇవి సాధారణ బదిలీల్లా తాము భావించడం లేదన్నారు.
తీర్మానాలకు మద్దతుగా సంతకాల సేకరణ
హైకోర్టు న్యాయవాదుల సంఘ సభ్యులు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. బదిలీ ప్రక్రియను నిలిపేసి ఇద్దరు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టులోనే కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేశారు. అసంబద్ధ బదిలీలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. బదిలీలను ఖండించడంతోపాటు ఇద్దరు జడ్జీలను ఇక్కడే ఉంచేందుకు తగిన చర్యలు చేపట్టేలా చూడాలని ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ను కోరుతూ తీర్మానం చేశారు. వాటికి మద్దతుగా వందల మంది న్యాయవాదులు సంతకాలు చేశారు. విధుల బహిష్కరణను కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే), న్యాయవాదులు జీవీ శివాజీ, జడ శ్రావణ్కుమార్, నల్లూరి మాధవరావు, కేఎం కృష్ణారెడ్డి, బొక్కా సత్యనారాయణ, సువ్వారి శ్రీనివాసరావు, నాగూరు నాగరాజు, ఎం.లక్ష్మీనారాయణ, పదిరి రవితేజ, తానికొండ చిరంజీవి, పీటా రామన్, సలీం పాషా, నర్రా శ్రీనివాసరావు, కోటా వెంకట రామారావు, ఎస్.ప్రణతి, యాగంటి సుష్మ, సుదీప్తి, జంపని శ్రీదేవి, దేవీ సత్యశ్రీ నేతృత్వంలో న్యాయవాదులు భారీగా పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
* తాము ఎలాంటి విధుల బహిష్కరణకు పిలుపు ఇవ్వలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకీరామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఓ న్యాయవాద సమూహం చేసిన తీర్మానానికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం నుంచి గుర్తింపు లేదన్నారు.
ప్రభుత్వానికి ఆపాదించొద్దు: ఏఏజీ
అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను గర్హిస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్