కెన్యాలోని సియాయా సెనేటర్‌కు మోకీళ్ల మార్పిడి

కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా సోదరుడు, సియాయా కౌంటీకి చెందిన సెనేటర్‌ ఒబురు ఒడింగా(79)కు నగరంలోని యశోద ఆసుపత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్‌ దశరథరామరెడ్డి ఆధ్వర్యంలో మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

Updated : 26 Nov 2022 05:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా సోదరుడు, సియాయా కౌంటీకి చెందిన సెనేటర్‌ ఒబురు ఒడింగా(79)కు నగరంలోని యశోద ఆసుపత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్‌ దశరథరామరెడ్డి ఆధ్వర్యంలో మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాలను శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు. ఒబురు ఒడింగా ఎడమ మోకీలు పూర్తిగా అరిగిపోయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. స్నేహితుల సూచనల మేరకు యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ దశరథరామరెడ్డిని సంప్రదించారు. నవంబరు 7న ఆయన ఆసుపత్రిలో చేరగా మరుసటి రోజు సర్జరీ జరిగింది. మోకీళ్ల సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఊబకాయం రాకుండా చూసుకోవాలని, నిత్యం కొంత సమయం వ్యాయామం చేయాలని సూచించారు. యూరప్‌ దేశాలతో పోల్చితే వైద్య ఖర్చులు ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయని, వైద్య సేవలు చక్కగా ఉన్నాయని ఒబురు ఒడింగా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు