క్షేమంగా వెళ్లొద్దాం అయ్యప్పా
కొవిడ్ అంతరాయాలతో గత రెండేళ్లుగా శబరిమల వెళ్లలేకపోయిన భక్తులు.. ఈసారి మండల పూజలు ప్రారంభమైన నవంబరు 16 నుంచే పెద్దఎత్తున అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తున్నారు.
శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ
పిల్లలు తప్పిపోకుండా రేడియో ట్యాగ్ల సౌకర్యం
పెద్దలు మోకాళ్లకు క్యాప్ ధరించడం శ్రేయస్కరం
నడవలేని వారికి డోలీ ఛార్జి రూ.5,200
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ అంతరాయాలతో గత రెండేళ్లుగా శబరిమల వెళ్లలేకపోయిన భక్తులు.. ఈసారి మండల పూజలు ప్రారంభమైన నవంబరు 16 నుంచే పెద్దఎత్తున అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తున్నారు. 41 రోజుల దీక్ష చేసిన వారితో పాటు.. మాలధారణ చేయకుండా దర్శనానికి వెళ్లేవారూ ఎక్కువగానే ఉంటున్నారు. ఒక్క మండల కాలం (నవంబరు 16- డిసెంబరు 27)లోనే 4 కోట్ల మందికి పైగా శబరిమలకు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో మాలధారణ చేసిన బాలలు తప్పిపోకుండా కేరళ పోలీసులు వేస్తున్న ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు ఈసారి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. వెడల్పు తక్కువగా ఉండే కొండ ప్రాంత రహదారులపై వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. తొలివారంలోనే రెండు భారీ ప్రమాదాలు జరగ్గా, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన 40 మంది గాయపడ్డారు కూడా. అందువల్ల జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లి, రావడం శ్రేయస్కరం.
వర్చువల్ క్యూలో నమోదు
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మండల పూజల నిమిత్తం ఈ నెల 16న తెరిచారు. డిసెంబరు 27 వరకు భక్తులు దర్శించుకోవచ్చు. మళ్లీ మకరజ్యోతి పూజల కోసం డిసెంబరు 30 నుంచి.. జనవరి 20 వరకు ఆలయం తెరిచి ఉంచుతారు. సంక్రాంతి రోజైన జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్పను దర్శించుకోవచ్చు. ఆధార్ నంబరుతో వర్చువల్ క్యూలో ఉచితంగా పేరు నమోదు చేసుకుంటే, నిర్ణీత సమయానికి దర్శనానికి వెళ్లొచ్చు. నీలక్కల్, పంబ ప్రాంతాల్లో కూడా తప్పనిసరిగా పేరు, ఆధార్ నమోదు చేశాకే కొండపైకి పంపుతున్నారు.
కేరళ ఆర్టీసీ మేలు
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రైవేటు వాహనాల్లో, ఆంధ్ర, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు అధికంగానే ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్లు, వ్యాన్ల వంటి చిన్న వాహనాలను పంబ వరకు..బస్సులను నీలక్కల్ వరకు అనుమతిస్తున్నారు. వాహనాలన్నీ పంబకు 20 కిలోమీటర్ల దూరంలోని నీలక్కల్ వద్ద పార్క్ చేయాల్సి ఉంటుంది. భక్తులు రానుపోను ప్రయాణాల్లో పంబ - నీలక్కల్ మధ్య నిరంతరం అందుబాటులో ఉండే కేరళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మేలు. చెంగనూరు, కొట్టాయం రైల్వేస్టేషన్ల నుంచి కూడా 24 గంటలూ బస్సులు నడుస్తూనే ఉన్నాయి.
* ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్న వారు, తమ డ్రైవరుకు కేరళ ఘాట్రోడ్లలో నడిపిన అనుభవం ఉందో, లేదో తెలుసుకున్నాకే ముందడుగు వేయాలి. వాహనం సామర్థ్యాన్ని (ఫిట్నెస్) ముందే తప్పనిసరిగా పరీక్షించుకోవాలి.
* రైళ్లలో వెళ్లే వారు.. స్థానికంగా కేరళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడమే క్షేమకరం.
బస్ఛార్జీలు ఇలా
నీలక్కల్-పంబ: ఏసీ బస్సు రూ.80 నాన్ ఏసీ రూ.50
చెంగనూరు-పంబ: నాన్ ఏసీ బస్సు రూ.180-225
కొట్టాయం-పంబ: నాన్ ఏసీ బస్సు రూ.295-424
మోకాళ్లకు క్యాప్ పెట్టుకోవాలి
పంబ నుంచి అయ్యప్ప సన్నిధానానికి చేరేందుకు నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం, శరంగుత్తి మీదుగా ఆరు కిలోమీటర్ల మేర ఉన్న కొండ మార్గంలో కాలినడకన ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మెట్ల మార్గాన్ని విస్తరించి, ఏటవాలు శ్లాబుగా మారుస్తున్నారు. దీనివల్ల అధిక శ్రమతో పాటు, మోకాళ్లపై తీవ్ర భారం పడుతోంది. అందువల్ల మోకాళ్ల సమస్యలున్న వారు తప్పనిసరిగా నీ క్యాప్ ధరించడం మేలు.
డోలీ ఛార్జీ రూ.5200
నడవలేని వారి కోసం నలుగురు మనుషులు మోసుకెళ్లే డోలీలు అందుబాటులో ఉంటాయి. పంబ నుంచి సన్నిధానం వరకు తీసుకెళ్లి, తిరిగి తీసుకువచ్చేందుకు రూ.5000 ఛార్జీని దేవస్థానం నిర్ణయించింది. రూ.200 రిజిస్ట్రేషన్ రుసుము అదనం. పంబ గణపతి ఆలయం దాటాక, ఈ బుకింగ్ కార్యాలయం ఉంటుంది. రద్దీని బట్టి, మనిషి బరువును బట్టి ఈ ఛార్జీలు బాగా మారుతున్నాయి.
చిన్న పిల్లలకు భద్రత
శబరిమల వస్తున్న 14 ఏళ్లలోపు పిల్లలకు పంబ గణపతి ఆలయం దాటాక, చేయి/మెడకు ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్లు వేస్తున్నారు. పిల్లలు రద్దీలో తప్పిపోయినా వెంటనే కనిపెట్టేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. చిన్నారి పేరు, తీసుకువచ్చిన వ్యక్తి పేరు, వివరాలు, ఫోన్ నంబరు ట్యాగ్పై నమోదు చేస్తారు. పిల్లలు తప్పిపోతే.. వెంటనే ఫోన్ చేసి, అప్పగిస్తున్నారు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్లో ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పవర్బ్యాంక్ తీసుకెళ్లాలి.
ప్రత్యేక దర్శనాలు లేవు: మంత్రులు, ఉన్నతాధికారులతో లేఖలు తీసుకెళ్తే, గతంలో అయ్యప్ప గర్భగుడి సమీపానికి అనుమతించేవారు. ఇప్పుడది రద్దు చేశారు. ఈ ప్రత్యేక పూజలకు రుసుము కడితే, స్వామిని కనులారా దర్శనం చేసుకోవచ్చు.
గణపతి పూజ: రూ.375 (స్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న మండపంపై ఈ పూజ తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది.)
పుష్పార్చన: రూ.12,500 (రాత్రి 7 గంటల నుంచి 9.30 మధ్య జరుగుతుంది. ఏడుగురిని స్వామి గర్భగుడి సమీపానికి అనుమతిస్తారు. భక్తులు తీసుకెళ్లే పుష్పాలతో అర్చన చేస్తారు.)
* కేరళ ఆర్టీసీ టికెట్లు, శబరిమల పూజలు, అక్కడ అద్దె గదులకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి