సీఎం జగన్‌ను కలిసిన గిరిధర్‌ అరమణే

రక్షణశాఖ తరఫున చేపట్టే ప్రాజెక్టులకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణే శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు.

Published : 27 Nov 2022 04:48 IST

ఈనాడు, అమరావతి: రక్షణశాఖ తరఫున చేపట్టే ప్రాజెక్టులకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణే శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. రక్షణశాఖకు సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమ అందించి సన్మానించారు. అనంతరం మచిలీపట్నంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌ను గిరిధర్‌ పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని