47 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్!
నిషిద్ధ జాబితాలో ఉన్న భూముల్లో 47 ఎకరాలను అక్రమంగా 111 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్లద్వారా కోట్ల రూపాయలు చేతులు మారాయి.
నిషిద్ధ జాబితాలో భూములకు కొత్త నంబర్లతో దగా
అనుయాయుల పేర్లతో తప్పుడు రిజిస్ట్రేషన్లు
మొగల్తూరు సబ్రిజిస్ట్రార్ జీవన్బాబు లీలలు
మొగల్తూరు, న్యూస్టుడే: నిషిద్ధ జాబితాలో ఉన్న భూముల్లో 47 ఎకరాలను అక్రమంగా 111 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్లద్వారా కోట్ల రూపాయలు చేతులు మారాయి. భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొగల్తూరు సమీపంలోని 5 గ్రామాల్లోని తీరంలో ఉన్న విలువైన ఈ భూములను సబ్-రిజిస్ట్రార్ జీవన్బాబు రిజిస్ట్రేషన్లు చేసేశారు. లేని సబ్ డివిజన్లు సృష్టించి, సర్వే నంబర్లకు అదనంగా అక్షరాన్ని చేర్చి ఈ అక్రమాల దందాను కొనసాగించినట్లు తెలిసింది. సబ్కలెక్టర్ సూర్యతేజ విచారణలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడింది. మొగల్తూరు మండలం శేరేపాలెం, పేరుపాలెం, కేపీపాలెం, రామన్నపాలెం, ముత్యాలపల్లి, కాళీపట్నం గ్రామాల పరిధిలో విలువైన భూములు ఉండటంతో అక్రమార్కులు కన్నేశారు. దీనికి సబ్రిజిస్ట్రార్ జీవన్బాబు సహకరించి, వారి పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసేశారు. తహసీల్దార్ అనితా కుమారి ఈ రిజిస్ట్రేషన్ల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. దానికి స్పందన రాలేదు. సబ్-కలెక్టర్ సూర్యతేజ తహసీల్దార్ కార్యాలయానికి శుక్రవారం వెళ్లినప్పుడు జరిగిన విషయాన్ని తహసీల్దార్ చెప్పారు. ఆయన వెంటనే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి, రికార్డులు తనిఖీ చేశారు. సెప్టెంబరు 1 నుంచి ఇటీవలి వరకు నిషిద్ధజాబితాలో ఉన్న 47 ఎకరాల భూములకు 111 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసినట్లు సబ్ కలెక్టర్ గుర్తించారు. నిషిద్ధ జాబితాలో ఉన్న డ్రెయిన్ పోరంబోకు, పంచాయతీ చెరువు భూములనూ రిజిస్టర్ చేశారు. రామన్నపాలెంలోని అడుగుపరలో ఉన్న దర్భరేవు డ్రెయిన్ పొడవునా ఉన్న 48 ఎకరాల పోరంబోకు భూమిలో 2.5 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరిగింది. మొగల్తూరులోని చెరువుభూమిని ఆక్రమించుకున్న స్థలాలకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. ముత్యాలపల్లి రెవెన్యూ గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న ఆర్ఎస్ నంబరు 460లోని 629.20 గజాల స్థలం, ఆ స్థలాల్లోని ఇళ్లను ఈ ఏడాది సెప్టెంబరు 22న నరసాపురంలో రిజిస్టర్ చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూములకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిసింది.
* ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ (ఎనీవేర్ రిజిస్ట్రేషన్) వెసులుబాటుతోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తెలిసింది. భీమవరం గ్రామీణ మండలం లోసరి, గూట్లపాడు తదితర గ్రామాల భూముల రిజిస్ట్రేషన్ల వెనుక పెద్ద ఎత్తున చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ప్రజాప్రతినిధి ఈ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆది నుంచి వివాదాస్పదమే
భీమవరం అర్బన్, న్యూస్టుడే: సబ్రిజిస్ట్రార్ జీవన్బాబు తీరు తొలి నుంచీ వివాదాస్పదమే. గతంలో ఉండిలో పని చేసి, ఈ ఏడాది జనవరిలో భీమవరం ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్గా వచ్చారు. దీని వెనుక రూ.లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. తర్వాత జూన్లో మొగల్తూరుకు బదిలీ అయినా భీమవరంలోనే కొనసాగేందుకు పైరవీలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో మొగల్తూరులో చేరారు. ఆయన వెళ్లగానే ఆ కార్యాలయ ఆదాయం 129% పెరిగి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న తణుకు (సజ్జాపురం) ఆదాయం 80%కే పరిమితమైంది. ఆయన ఉంటే పని అవుతుందని ఎక్కడెక్కడివారో మొగల్తూరు వెళ్లడం వల్లే అలా పెరిగిందన్న ఆరోపణలున్నాయి.
* భీమవరంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే గునుపూడి పరిధిలో నాన్ లేఅవుట్లోని 30 ఫ్లాట్లను ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
* జీవన్బాబు పూర్వ తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో విధులు నిర్వహిస్తుండగా అంతకుముందు పనిచేసిన జంగారెడ్డిగూడెంలో దస్తావేజులు ట్యాంపరింగ్ చేసినట్లు విచారణలో బయటపడింది. దీంతో సస్పెండయ్యారు. తర్వాత మళ్లీ సర్వీసులో చేరారు.
* ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే ఓ నాయకుడు తన బంధువని ఆయన చెప్పుకోవడంతో చాలామంది అధికారులు ఆయన జోలికి వెళ్లేందుకు వెనకాడేవారు.
మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ జీవన్బాబు వ్యవహారంపై విచారణకు అధికారులు ఆదేశించారని, నివేదిక అందాక వారే చర్యలు తీసుకుంటారని భీమవరం జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ తెలిపారు. జీవన్బాబుతో ఫోన్లో మాట్లాడేందుకు ‘న్యూస్టుడే’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ