మట్టి పోశారు.. మరిచిపోయారు
గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు రూ.150 కోట్లతో 2021 జూన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ నుంచి ఎన్-13 రోడ్డు వరకు 15.5 కి.మీ దూరం కరకట్టను విస్తరించి బలోపేతం చేయాల్సి ఉంది.
గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు రూ.150 కోట్లతో 2021 జూన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ నుంచి ఎన్-13 రోడ్డు వరకు 15.5 కి.మీ దూరం కరకట్టను విస్తరించి బలోపేతం చేయాల్సి ఉంది. పనులు ప్రారంభమై 17 నెలలు అవుతోంది. మంతెన ఆశ్రమం నుంచి అర కిలోమీటరు వరకూ కరకట్ట పక్కన జేసీబీలతో తవ్వి మట్టిని పోశారు. భూసేకరణ జరగకపోవడం, పరిహారం విషయంలో సమస్యలు తలెత్తడంతో రైతులు పనులను ఆపించేశారు. ఈ దారిలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్ అధికారులు సచివాలయం వెళ్తుంటారు. ఇంత ముఖ్యమైన దారి విస్తరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు.
- ఈనాడు, అమరావతి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ట్రాన్స్జెండర్తో వివాహం.. యువకుడికి బంధువుల వేధింపులు
-
Politics News
Eatala Rajender: నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారు: ఈటల
-
Ap-top-news News
Gas Cylinder: సిలిండర్ తెచ్చినందుకు అదనపు రుసుము చెల్లించొద్దు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్